News November 21, 2024
అదానీపై అమెరికాలో కేసు ఎందుకు?

అదానీ ఇండియాలోని ప్రభుత్వాలకు, డిస్కంలకు లంచం ఇచ్చారని USలో కేసు నమోదవడం ఏంటి? వారెంట్ జారీ చేయడమేంటి? అనుకుంటున్నారా? తప్పుడు పద్ధతుల్లో అమెరికా నుంచి పెట్టుబడులు రాబట్టారనేది అదానీపై ఉన్న ప్రధాన ఆరోపణ. అవినీతి మార్గంలో ప్రాజెక్టులు చేపట్టి, వాటిల్లో తమ దేశ పౌరులతో ఇన్వెస్ట్ చేయించుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. ఇలా చేయడం ఆ దేశంలో చట్టవిరుద్ధం. అందుకే అక్కడ కేసు పెట్టారు.
Similar News
News December 4, 2025
ఎల్లుండి నుంచి APP పరీక్షల హాల్ టికెట్లు

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల పరీక్షా హాల్ టికెట్లను ఈ నెల 6వ తేదీ ఉ.8గం. నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని TSLPRB ప్రకటించింది. 13వ తేదీ రాత్రి 12గం. వరకు సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనెల 14న రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉ.10గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గం. వరకు పేపర్-2(డిస్క్రిప్టివ్) ఉంటాయని తెలిపింది.
News December 4, 2025
APPLY NOW: టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

<
News December 4, 2025
మొక్కజొన్న కోత, నిల్వలో తేమ ముఖ్యం

మొక్కజొన్న పంట కోత సమయంలో తేమ కీలకమని, రైతులు సరైన సమయంలో కోత చేపడితే మంచి ధర పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. గింజల్లో 25 నుంచి 30 శాతం తేమ ఉన్నప్పుడు కోత చేపట్టి కండెలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టాలి. సుమారు 15 శాతం తేమ ఉన్నప్పుడు నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టాలి. గోదాములలో నిల్వ చేయాలనుకుంటే సుమారు 10 శాతం తేమ ఉన్న గింజలను నిల్వచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


