News September 27, 2024

వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు?: జగన్

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారని YS జగన్ వెల్లడించారు. ’22న EO నివేదికలో కూడా ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు ఉంది. EO చెప్పినా కూడా CM రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు ఆడుతూ తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. జరగనిది జరిగినట్లుగా అబద్ధాన్ని ప్రచారం చేయడం ధర్మమేనా? ఇది అపవిత్రత కాదా?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 10, 2025

జిమ్‌కి వెళ్లేముందు మేకప్ వేసుకుంటున్నారా?

image

జిమ్‌కి వెళ్లేటపుడు మేకప్ వేసుకోవడం చర్మం దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. సాధారణంగా వ్యాయామం చేసేప్పుడు చర్మరంధ్రాలు విస్తరిస్తాయి. కానీ మేకప్ వేసుకుంటే చర్మరంధ్రాలు విస్తరించకుండా మేకప్ అడ్డుగా ఉంటుంది. దీంతో సెబమ్ ఉత్పత్తి తగ్గి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు, స్కిన్ ఇరిటేషన్ వంటివి వస్తాయని చెబుతున్నారు. వ్యాయామం చేసేప్పుడు మేకప్ వేసుకోకపోతే చర్మం సహజంగా మెరుస్తుందని తెలిపారు.

News December 10, 2025

సోషల్ మీడియాతో పిల్లల్లో ఏకాగ్రత లోపం!

image

సోషల్ మీడియా వినియోగం పిల్లలలో ఏకాగ్రత లోపానికి దారితీసి ADHD లక్షణాలను పెంచుతుందని స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ నివేదికలో వెల్లడైంది. ‘SM వాడటం వల్ల పిల్లలు ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు. ఇది వారి మెదడు అభివృద్ధిపై, ముఖ్యంగా ఏకాగ్రత సామర్థ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించడంపై పేరెంట్స్ దృష్టిసారించాలి’ అని నివేదిక సూచించింది.

News December 10, 2025

వయ్యారిభామ అతి వ్యాప్తికి కారణమేంటి?

image

ఒక వయ్యారిభామ మొక్క 10 నుంచి 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలు చాలా చిన్నవిగా ఉండి గాలి ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి అక్కడ మొలకెత్తుతాయి. అధిక విత్తన ఉత్పత్తి, విత్తన వ్యాప్తి, పశువులు తినలేకపోవడం ఈ మొక్కల వ్యాప్తికి ప్రధాన కారణం. వయ్యారిభామ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని, జూన్-జులైలో వర్షాల సమయంలో వృద్ధి చెంది, పొలాల్లో ప్రధాన పంటలతో పోటీ పడతాయి.