News September 27, 2024

వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు?: జగన్

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారని YS జగన్ వెల్లడించారు. ’22న EO నివేదికలో కూడా ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు ఉంది. EO చెప్పినా కూడా CM రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు ఆడుతూ తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. జరగనిది జరిగినట్లుగా అబద్ధాన్ని ప్రచారం చేయడం ధర్మమేనా? ఇది అపవిత్రత కాదా?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 26, 2025

మతపరమైన గొడవ కాదు.. అతడో క్రిమినల్: బంగ్లా సర్కార్

image

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు <<18670618>>అమృత్ మండల్<<>> హత్యకు గురికావడంపై అక్కడి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘ఇది మతపరంగా జరిగిన ఘర్షణ కాదు. అమృత్ మండల్ ఓ టాప్ క్రిమినల్. అతను ఓ ఏరియాలో డబ్బులు డిమాండ్ చేసేందుకు రాగా స్థానికులతో జరిగిన గొడవలో చనిపోయాడు’ అని పేర్కొంది. కాగా దీపూ చంద్రదాస్ హత్య తర్వాత మరో హిందూ హత్యకు గురికావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

News December 26, 2025

చిరిగిన నోట్లు ఇలా మార్చుకోండి!

image

మీ దగ్గర చిరిగిన నోట్లు ఉన్నాయా? కంగారుపడొద్దు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం రూ.10 కంటే ఎక్కువ విలువైన నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. నోటు మురికిగా మారినా, కొద్దిగా చిరిగినా కొత్తవి ఇస్తారు. గాంధీ ఫొటో, ఆర్బీఐ గవర్నర్ సంతకం, వాటర్ మార్క్ మిస్ అయితే నోటులో కొంత విలువను చెల్లిస్తారు. ఎలాంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదు. పూర్తిగా కాలిపోయినా, దెబ్బతిన్నా RBI ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకోవచ్చు.

News December 25, 2025

ప్రస్తుతం నా క్రష్ మృణాల్ ఠాకూర్: నాగవంశీ

image

హీరోయిన్లలో రష్మిక అంటే ఇష్టమని, మృణాల్ ఠాకూర్ తన క్రష్ అని నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు Ntr నటించిన ‘వార్-2’కు భారీ నష్టాలంటూ జరిగిన ప్రచారంపై ఆయన స్పందించారు. ‘తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రూ.68 కోట్లకు కొన్నాను. దానికి రూ.35-40 కోట్ల షేర్ వచ్చింది. ఈ క్రమంలో ఆ మూవీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ పిలిచి రూ.18 కోట్లు వెనక్కి ఇచ్చింది. పెద్దగా నష్టాలు రాలేదు’ అని పేర్కొన్నారు.