News September 27, 2024

వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు?: జగన్

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారని YS జగన్ వెల్లడించారు. ’22న EO నివేదికలో కూడా ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు ఉంది. EO చెప్పినా కూడా CM రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు ఆడుతూ తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. జరగనిది జరిగినట్లుగా అబద్ధాన్ని ప్రచారం చేయడం ధర్మమేనా? ఇది అపవిత్రత కాదా?’ అని ప్రశ్నించారు.

Similar News

News January 2, 2026

NZలో ఆవు మూత్రం.. 2 లీటర్లకు రూ.13వేలు

image

న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌లోని Navafresh అనే ఇండియన్ స్టోర్‌లో ఆవు మూత్రం, పేడ అమ్ముతుండటంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆవు మూత్రం 2 లీటర్లకు 253 డాలర్లు (రూ.13వేలు), ఆవు పేడ కేజీ 220 డాలర్లు (రూ.11వేలు), ఆవు పేడతో చేసిన బేబీ పౌడర్ 214-250 డాలర్లుగా ఉన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. వీటిలో శక్తిమంతమైన యాంటీ బయోటిక్స్ ఉంటాయని, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని వాటిపై రాసినట్లుందని ఆమె పేర్కొన్నారు.

News January 2, 2026

AMPRIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI)లో 13 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 4 ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, బీఎస్సీ(సైన్స్, CS), టెన్త్, ఐటీఐ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. టెక్నికల్ అసిస్టెంట్‌కు నెలకు రూ.66,500, టెక్నీషియన్‌కు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ampri.res.in

News January 2, 2026

సిద్ధమవుతున్న బరులు.. సన్నద్ధమవుతున్న పుంజులు

image

సంక్రాంతికి కోడి పందేల కోసం గోదావరి జిల్లాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. చాలాచోట్ల పొలాలను చదును చేసి బరులుగా మారుస్తున్నారు. ఇక కొన్నిచోట్ల అయితే బరుల వద్దే సోఫా సీటింగ్, ACలు, లైవ్ స్క్రీన్స్ కోసం ఆర్డర్స్ వచ్చినట్లు షామియానాల నిర్వాహకులు తెలిపారు. అటు కోడిపుంజులనూ పందెంరాయుళ్లు సన్నద్ధం చేస్తున్నారు. రెగ్యులర్‌గా జీడిపప్పు, బాదం తదితర డైట్ ఫుడ్‌కు తోడు ఎక్కువ ఎక్సర్‌సైజులు చేయిస్తున్నారు.