News September 27, 2024

వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు?: జగన్

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారని YS జగన్ వెల్లడించారు. ’22న EO నివేదికలో కూడా ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు ఉంది. EO చెప్పినా కూడా CM రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు ఆడుతూ తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. జరగనిది జరిగినట్లుగా అబద్ధాన్ని ప్రచారం చేయడం ధర్మమేనా? ఇది అపవిత్రత కాదా?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 18, 2025

రోల్ బాల్ WC విజేతలుగా భారత జట్లు

image

దుబాయ్ వేదికగా జరిగిన రోల్ బాల్ వరల్డ్ కప్‌లో భారత మెన్స్, ఉమెన్స్ టీమ్స్ అదరగొట్టి ఛాంపియన్లుగా నిలిచాయి. కెన్యా జట్లతో జరిగిన ఫైనల్‌లో మహిళల జట్టు 3-2 తేడాతో, పురుషుల జట్టు 11-10 తేడాతో విజయం సాధించాయి. కాగా ఇది రోలర్ స్కేట్స్‌తో ఆడే ఒక గేమ్. బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, త్రోబాల్ కలయికలో ఉంటుంది. ఆటగాళ్లు స్కేట్స్ వేసుకొని బంతిని చేతులతో పాస్ చేసుకుంటూ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి వేయాలి.

News December 18, 2025

విడాకులు తీసుకున్నట్లు నటుడి ప్రకటన

image

17 ఏళ్ల వివాహ బంధానికి సీనియర్ నటుడు షిజు ఏఆర్ ముగింపు పలికారు. ‘ప్రీతికి, నాకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరయ్యాయి. ఇకపై ఇద్దరం స్నేహితులుగా ఉంటాం. మా ప్రైవసీకి భంగం కల్గించొద్దని కోరుతున్నా’ అని సోషల్ మీడియాలో తెలిపారు. మాలీవుడ్ పాపులర్ నటుల్లో ఒకరైన షిజు తెలుగులో ‘దేవి’తో పరిచయమై ‘సింహరాశి, మనసంతా నువ్వే, గౌతమ్ SSC, నువ్వు నాకు నచ్చావ్, శతమానం భవతి, రాబిన్ హుడ్’ తదితర సినిమాల్లో నటించారు.

News December 18, 2025

జోగి రమేశ్‌కు చుక్కెదురు

image

AP: నకిలీ మద్యం కేసు నిందితుడు (A18) జోగి రమేష్ బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. ఆయనతో పాటు A19 జోగి రాములు, A2జగన్మోహన్ రావులకూ కోర్టు ఈనెల 31 వరకు రిమాండ్ విధించడంతో వారిని పోలీసులు తిరిగి జైలుకు తరలించారు. ఇక ఈ కేసులోని మరో ఏడుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. అటు నెల్లూరు జైలు నుంచి విజయవాడ జైలుకు తరలించాలన్న జోగి బ్రదర్స్ వినతిని న్యాయస్థానం ఆమోదించింది.