News September 27, 2024
వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు?: జగన్

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారని YS జగన్ వెల్లడించారు. ’22న EO నివేదికలో కూడా ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు ఉంది. EO చెప్పినా కూడా CM రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు ఆడుతూ తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. జరగనిది జరిగినట్లుగా అబద్ధాన్ని ప్రచారం చేయడం ధర్మమేనా? ఇది అపవిత్రత కాదా?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 18, 2025
మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్: లోకేశ్

AP: మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పాలనా సంస్కరణలు నినాదాలను మించినవైతే గుర్తింపు తప్పకుండా వస్తుంది. అత్యంత గౌరవనీయమైన అవార్డు.. బలమైన జ్యూరీ. అది ఏ అవార్డు? ఎవరు గెలుచుకున్నారో ఊహించండి. మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్’ అని పేర్కొన్నారు. CM చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గురించే లోకేశ్ చెబుతున్నారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
News December 18, 2025
ESIC హాస్పిటల్లో ఉద్యోగాలు

<
News December 18, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.1,34,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 ఎగబాకి రూ.1,23,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,24,000కు చేరింది. వెండి ధర రెండ్రోజుల్లోనే రూ.13వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


