News October 22, 2024
లిఫ్టులో అద్దం ఎందుకుంటుంది?

మనం ఎలా ఉన్నామో చూసుకోవడానికి అనుకుంటే పొరపడినట్లే. చాలా మంది చిన్న ప్రదేశాల్లో లాక్ చేయడంతో భయపడి ఆందోళన చెందుతుంటారు. అద్దం ఉండటం వల్ల లిఫ్ట్ పెద్దగా కనిపించి భయమనిపించదు. హార్ట్ బీట్ పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. దీంతోపాటు అద్దాలు లిఫ్టులో ఉన్న ఇతరుల కదలికలను తెలుసుకొని దొంగతనాలు, దాడులను నిరోధించడానికి పనికొస్తాయి.
Similar News
News December 13, 2025
రేపే రెండో విడత.. ఉ.7 గంటలకు పోలింగ్ స్టార్ట్

TG: రాష్ట్రంలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తర్వాత 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. సెకండ్ ఫేజ్లో 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 స్థానాలు, 38,322 వార్డులకు 8,300 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు అందజేశారు.
News December 13, 2025
ఫేక్ డొనేషన్లతో క్లెయిమ్స్.. వారికి IT శాఖ హెచ్చరికలు

డొనేషన్ల పేరుతో బోగస్ క్లెయిమ్స్ చేసుకుంటున్న వారిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) దృష్టిపెట్టింది. చర్యలు తీసుకునే ముందు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. స్వచ్ఛందంగా తమ ఆదాయపన్ను రిటర్నులను విత్ డ్రా చేసుకోవాలని, ITRలను అప్డేట్ చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు SMSలు, ఈమెయిల్స్ ద్వారా సమాచారమిస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులను రివైజ్ చేసినట్లు చెబుతోంది.
News December 13, 2025
21న 54 లక్షల మందికి పోలియో చుక్కలు

AP: నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఈనెల 21న రాష్ట్రంలో 54 లక్షల మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీనికోసం 38,267 బూత్లు ఏర్పాటు చేసి 61,26,120 డోస్ల వ్యాక్సిన్ను రెడీ చేశామన్నారు. ఆరోజు చుక్కలు వేసుకోలేని పిల్లలకు 22, 23 తేదీల్లో 76,534 బృందాలు ఇంటింటికీ వెళ్లి వేస్తాయన్నారు. మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటు చేశామన్నారు.


