News April 6, 2025
సన్న బియ్యం దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు?: మహేశ్ గౌడ్

తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వానివేనని BJP నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ‘BJP దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్రమంత్రి బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి, సొంత పార్టీలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల కోసం కొందరు HCUపై మాట్లాడటం సరికాదు. మేం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా’ అని ప్రశ్నించారు.
Similar News
News April 8, 2025
మెగా DSC.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

AP: విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. DSC, టెన్త్, ఇంటర్ ఫలితాలతో పాటు పలు అంశాలపై సమీక్షించారు. రాబోయే 4ఏళ్లు విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాలన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా వీలైనంత త్వరగా DSC ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెన్త్, ఇంటర్ ఫలితాల ప్రకటన విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News April 8, 2025
KG రైస్కు రూ.43 ఖర్చు.. రూ.10కి అమ్ముకోవడం దారుణం: నాదెండ్ల

AP: సన్నబియ్యం విషయంలో తెలంగాణతో పోటీపడబోమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అందించేది నాణ్యమైన బియ్యమని అందుకుగాను KG రైస్కు రూ.43 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ మెుత్తంలో కేంద్రం 61, రాష్ట్రం 39శాతం భరిస్తోందని పేర్కొన్నారు. ఇంత ఖర్చుచేసి పేదలకు బియ్యం అందిస్తుంటే వాటిని రూ.10కి అమ్ముకోవడం దారుణమన్నారు. బియ్యం రీ సైక్లింగ్ కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
News April 8, 2025
టెన్త్ పరీక్షలు రాశారా.. నెక్స్ట్ ఏంటి?

టెన్త్ తర్వాత ఏం చేయాలో ఫిక్స్ అయ్యారా? సరైన గైడెన్స్ లేకపోవడంతో చాలా మంది ఎదుటివారిని చూసి ఆ కోర్సుల్లో జాయిన్ అవుతుంటారు. కానీ, టెన్త్ తర్వాత తీసుకునే నిర్ణయంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా పాలిటెక్నిక్, NTTIలో జాయిన్ అవ్వొచ్చు. ITI, IIIT, పారామెడికల్, ఇంజినీరింగ్, డిప్లొమా, గురుకులాలతో పాటు ఇంటర్లో MPC, BiPC, MEC, HEC కోర్సుల్లో జాయిన్ అవ్వొచ్చు. SHARE IT