News April 29, 2024

పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు?: పవన్ కళ్యాణ్

image

AP: స్కూళ్లలో పిల్లలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫొటో పెట్టడమేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘ఐదేళ్ల నుంచి బెయిల్‌పై ఉన్న వ్యక్తి బొమ్మ పుస్తకాలపై పెట్టడమేంటి? జగన్ హయాంలో 3.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల మానేశారు. పిల్లలకు ఇచ్చే చిక్కీ కవర్లపై రూ.67 కోట్ల కొట్టేసిన వ్యక్తి జగన్. ఆయన హయాంలో పేకాట క్లబ్బులు, మద్యం, ఇసుక దోపిడీలే ఉన్నాయి. వైసీపీ ఓటమి తథ్యం’ అని గణపవరం సభలో పవన్ విమర్శించారు.

Similar News

News September 18, 2025

తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

image

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.

News September 18, 2025

Maturity Laws: ఇవి పాటించు గురూ!

image

* అందరికీ ప్రతీది చెప్పడం మానేయండి. ఎందుకంటే చాలా మంది వాటిని పట్టించుకోరు. బలహీనతలను అస్సలు చెప్పొద్దు
* స్నేహితులను తెలివిగా ఎంచుకోండి. సరైన స్నేహితులే మీ ఎదుగుదలను ప్రోత్సహిస్తారు
* ఏమీ ఆశించకండి. అభినందించడం నేర్చుకోండి
* మీ వంతు కృషి చేయండి. ఫలితమేదైనా స్వీకరించండి.
* ఇతరులను కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టండి.
* పరిస్థితులకు తగ్గట్లు స్పందించడం అలవాటు చేసుకోండి.

News September 18, 2025

ఇద్దరు MBBS విద్యార్థుల ఆత్మహత్య

image

AP: విశాఖ గీతం మెడికల్ కాలేజీలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన MBBS ఫస్ట్ ఇయర్ విద్యార్థి విస్మాద్ సింగ్ (20) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నిన్న కాలేజీ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ‘ఈ లోకంలో నేను బతకలేను. నాకు మరో జన్మ వద్దు’ అని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు MBBS ఫస్టియర్‌లో ఫెయిలైన విశాఖ NRI కాలేజీ స్టూడెంట్ జ్యోత్స్న ఆత్మహత్య చేసుకుంది.