News April 29, 2024
పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు?: పవన్ కళ్యాణ్

AP: స్కూళ్లలో పిల్లలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫొటో పెట్టడమేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘ఐదేళ్ల నుంచి బెయిల్పై ఉన్న వ్యక్తి బొమ్మ పుస్తకాలపై పెట్టడమేంటి? జగన్ హయాంలో 3.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల మానేశారు. పిల్లలకు ఇచ్చే చిక్కీ కవర్లపై రూ.67 కోట్ల కొట్టేసిన వ్యక్తి జగన్. ఆయన హయాంలో పేకాట క్లబ్బులు, మద్యం, ఇసుక దోపిడీలే ఉన్నాయి. వైసీపీ ఓటమి తథ్యం’ అని గణపవరం సభలో పవన్ విమర్శించారు.
Similar News
News January 22, 2026
10సెకన్లలో హార్ట్ అటాక్ ముప్పు గుర్తించే సెన్సర్..

హార్ట్ అటాక్ ముప్పును 10సెకన్లలోనే గుర్తించే స్పెషల్ సెన్సర్ను బనారస్ హిందూ యూనివర్సిటీ రీసెర్చర్స్ డెవలప్ చేశారు. రక్తంలోని C-రియాక్టివ్ ప్రొటీన్(CRP) లెవెల్స్ను వేగంగా, కచ్చితంగా కొలిచే ఇంపెడిమెట్రిక్ సెన్సర్ను తయారుచేశారు. మిల్లీలీటరుకు 0.5నానోగ్రామ్స్ ఉన్న CRP లెవెల్స్ను కూడా ఈ సెన్సర్ గుర్తిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెస్టులు ప్రీమియంతోపాటు రిజల్ట్ కోసం ఎక్కువ సమయం వేచిఉండాలి.
News January 22, 2026
DGEMEలో ఉద్యోగాలు

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్(DGEME) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.indianarmy.nic.in/
News January 22, 2026
ట్రంప్ విమర్శలపై మోదీ మౌనం వెనక మతలబిదీ..!

ప్రపంచ నేతలను ట్రంప్ ఎడాపెడా వాయించేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, కెనడా PM కార్నీ, UK PM స్టార్మర్.. ఇలా స్థాయి, హోదా చూడకుండా కఠిన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితిని ఊహించే మన ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ చేసిన ఏ విమర్శలకూ స్పందించలేదు. మౌనం పాటిస్తూ ఆయన వలలో పడకుండా చూసుకున్నారు. మోదీ ఈ హుందాతనం వల్లే ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే సాహసం ట్రంప్ చేయలేదు.


