News August 28, 2024
మాగుంటను ఎందుకు నిందితుడిగా చేర్చలేదు: సుప్రీం

AP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో TDP MP మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో మాగుంటకు కవితతో దాదాపు సమానపాత్ర ఉందని పేర్కొంది. ‘కేసు ఫైళ్లను చూస్తే నిర్ణయాలన్నీ MP ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది. అయినా ఆయనను నిందితుడిగా చేర్చలేదు. ఇష్టం ఉంటే వదిలేసి, ఇష్టం లేకపోతే నిందితులుగా చేర్చుతారా’ అని ED తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Similar News
News February 21, 2025
APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో 518 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ మేనేజర్ మొదలు క్లౌడ్, ఏఐ ఇంజినీర్ పోస్టుల వరకూ పలు కొలువులు వీటిలో ఉన్నాయి. 22-43 మధ్య వయసుండి డిగ్రీ, బీఈ, సీఏ, బీటెక్, ఎంబీయే విద్యార్హతలున్న వారు సంబంధిత విభాగాల్లో అప్లై చేసుకోవచ్చు. మార్చి 11 తుది గడువు.
News February 21, 2025
24 నుంచి ఆధార్ స్పెషల్ శిబిరాలు

AP: ఈ నెల 24-28 వరకు అన్ని జిల్లాల్లో ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు, పాత వాటిలో మార్పులకు ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా రాష్ట్రంలో ఆరేళ్లలోపు 8.53L మంది, ఆ పైబడిన వారికి సంబంధించి 42.10L మంది ఆధార్ అప్డేట్ నమోదు పెండింగ్లో ఉందన్నారు.
News February 21, 2025
OTTలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’

బాబీ డైరెక్షన్లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.170 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించగా, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు.