News February 14, 2025
విడిపోయే దానికి కలవడం ఎందుకు?

నేడు వాలంటైన్స్ డే. ఈరోజు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రేమికులు ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటుంటారు. కానీ, కొందరు చిన్న గొడవలకే విడిపోతూ వచ్చే ప్రేమికుల రోజున మరొకరికి ఇదే వాగ్దానాన్ని రిపీట్ చేస్తున్నారు. ప్రస్తుతం నిలబడే ప్రేమలకంటే అవసరం తీరాక మొహం చాటేసే ప్రేమలే ఎక్కువైపోయాయని లవ్ ఫెయిల్యూర్స్ Xలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబోయే భాగస్వామిలో ప్రేమను వెతుక్కోవడం బెటర్ అంటున్నారు. మీరేమంటారు?
Similar News
News November 22, 2025
వనపర్తి: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

భర్త మృతిని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వీపనగండ్లకు చెందిన మౌలాలి 15 రోజుల క్రితం మరణించాడు. మౌలాలి భార్య అలివేల (50) భర్త మరణంతో కుంగిపోయి తీవ్ర మానసిక ఆవేదనకు గురైంది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది.
News November 22, 2025
బాలికలకు సంతూర్ స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్సైట్: <
News November 22, 2025
రైతులకు గుడ్ న్యూస్.. ఫసల్ బీమా యోజనలో మార్పులు!

PM ఫసల్ బీమా యోజనలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇకపై జంతువుల దాడి, వరదలు/నీట మునగడం వల్ల పంట నష్టం వాటిల్లితే పరిహారం ఇవ్వనుంది. ఇప్పటిదాకా కరవు, వడగళ్లు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులే స్కీమ్లో ఉండేవని, కొత్తగా ఈ రెండింటిని చేర్చామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2026-27 ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు.


