News August 25, 2024
వారిని జైలుకు ఎందుకు పంపట్లేదు?: సీఎంకు మాజీ ఐఏఎస్ లేఖ

AP: పరిశ్రమల్లో ప్రమాదాలకు కారణమవుతున్న యజమానులను ఎందుకు జైలుకు పంపట్లేదని రిటైర్డ్ IAS ఈఏఎస్ శర్మ ప్రశ్నించారు. అచ్యుతాపురం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రమాదం జరిగిందన్న CBN వ్యాఖ్యలను తప్పుపట్టారు. 2014-19 మధ్య 24 ప్రమాదాల్లో 21 మంది చనిపోయారని గుర్తుచేశారు.
Similar News
News January 30, 2026
గోల్డ్, సిల్వర్ ఎఫెక్ట్.. మెటల్ స్టాక్స్ ఢమాల్

బంగారం, వెండి సహా బేస్ మెటల్స్ ధరలు భారీగా తగ్గడంతో ఈరోజు లోహపు షేర్ల విలువలు పడిపోయాయి. హిందూస్థాన్ జింక్ (12%), వేదాంత (11%), NALCO (10%), హిందూస్థాన్ కాపర్ (9.5%), హిందాల్కో (6%), NMDC (4%) స్టాక్స్ వాల్యూస్ కుంగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 5% పతనమైంది. డాలర్ పుంజుకోవటంతో ఓ దశలో గోల్డ్ ధరలు 9%, సిల్వర్ రేట్లు 15% మేర కరెక్ట్ అయ్యాయి.
News January 30, 2026
బ్లాక్ హెడ్స్ను తొలగించే ఇంటి చిట్కాలు

బ్లాక్ హెడ్స్ను తొలగించడానికి ముందుగా ముఖానికి ఆవిరి పట్టాలి. తర్వాత వెట్ టవల్తో సున్నితంగా రుద్దాలి. * పెరుగు, శనగపిండి, కాఫీ పొడి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ మీద రాసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. * గుడ్డులోని తెల్లసొనలో బేకింగ్ సోడా కలిసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకొని కడిగేసుకోవాలి.
News January 30, 2026
ఎక్కువ పూజలు చేస్తే ఎక్కువ కష్టాలొస్తాయా?

ఇది నిజం కాదని పండితులు చెబుతున్నారు. కష్టసుఖాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయని, ఇవి పూర్వ కర్మల ఫలితంగా వస్తుంటాయని అంటున్నరు. పూజలు చేస్తే ఆ కష్టాలను తట్టుకునే మనోబలం, సానుకూల శక్తి లభిస్తాయంటున్నారు. అంతే తప్ప కొత్తగా కష్టాలు రావని సూచిస్తున్నారు. అయితే ఆడంబరంగా చేసే పూజల కన్నా భక్తి ప్రాధాన్యంతో చేసే పూజలకే అధిక ఫలం ఉంటుంది. నిష్కల్మషంగా ప్రార్థిస్తే భగవంతుడు మన కోర్కెలు నెరవేరుస్తాడు.


