News August 25, 2024
వారిని జైలుకు ఎందుకు పంపట్లేదు?: సీఎంకు మాజీ ఐఏఎస్ లేఖ

AP: పరిశ్రమల్లో ప్రమాదాలకు కారణమవుతున్న యజమానులను ఎందుకు జైలుకు పంపట్లేదని రిటైర్డ్ IAS ఈఏఎస్ శర్మ ప్రశ్నించారు. అచ్యుతాపురం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రమాదం జరిగిందన్న CBN వ్యాఖ్యలను తప్పుపట్టారు. 2014-19 మధ్య 24 ప్రమాదాల్లో 21 మంది చనిపోయారని గుర్తుచేశారు.
Similar News
News January 4, 2026
త్వరలో కృష్ణా జలాలపై మాట్లాడతా: చంద్రబాబు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న అసెంబ్లీలో TG సీఎం రేవంత్ వ్యాఖ్యలపై AP సీఎం చంద్రబాబు స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన ఆయన కృష్ణా జలాలపై త్వరలోనే మాట్లాడతానని తెలిపారు. దానికి సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తానని అన్నారు.
News January 4, 2026
దర్శకుడికి అనారోగ్యం.. ఐసీయూలో చికిత్స

ప్రముఖ దర్శకుడు భారతీరాజా అనారోగ్యంతో చెన్నైలోని MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతనెల 27న శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న ఆయనను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ICUలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం రాజా ఆరోగ్యం నిలకడగా ఉందని, ట్రీట్మెంట్కు స్పందిస్తున్నారని వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. కాగా అంతకుముందు భారతీరాజా మరణించారంటూ SMలో తప్పుడు ప్రచారం జరిగింది.
News January 4, 2026
మీ పిల్లలకు కాల్షియం లోపం రాకుండా ఇవి తినిపించండి

పిల్లల్లో కాల్షియం లోపం రాకుండా చూసుకోవాలి. ఎముకలు, దంతాల బలానికి ఇది చాలా అవసరం. అందుకే ఆహారంలో పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు తప్పనిసరిగా ఉండాలి. పాలకూర, తోటకూర, మునగాకు వంటి ఆకుకూరలు, నల్ల నువ్వులు, బాదం, రాగి జావ, రాగి లడ్డూలు, గుడ్లు, చేపలు కూడా ఎంతో మేలు చేస్తాయి. కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్-D చాలా అవసరం. అందుకే పిల్లలను ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో ఆడుకోనివ్వాలి.


