News August 25, 2024

వారిని జైలుకు ఎందుకు పంపట్లేదు?: సీఎంకు మాజీ ఐఏఎస్ లేఖ

image

AP: పరిశ్రమల్లో ప్రమాదాలకు కారణమవుతున్న యజమానులను ఎందుకు జైలుకు పంపట్లేదని రిటైర్డ్ IAS ఈఏఎస్ శర్మ ప్రశ్నించారు. అచ్యుతాపురం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రమాదం జరిగిందన్న CBN వ్యాఖ్యలను తప్పుపట్టారు. 2014-19 మధ్య 24 ప్రమాదాల్లో 21 మంది చనిపోయారని గుర్తుచేశారు.

Similar News

News November 19, 2025

ఈవీల విక్రయాల్లో MG విండ్సర్ రికార్డ్

image

ఈవీ కార్ల అమ్మకాల్లో MG విండ్సర్ రికార్డులు బద్దలు కొడుతోంది. భారత్‌లో 400 రోజుల్లోనే 50వేల యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. నెలకు 3,800పైగా కార్ల చొప్పున విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. భారతీయ మార్కెట్లో అత్యంత వేగంగా 50వేల మార్కును అందుకున్న ఫోర్ వీలర్ ఈవీగా నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన MG.. ఇండియాలో JSWతో జతకట్టి తమ కార్ల విక్రయాలు ప్రారంభించింది.

News November 19, 2025

సూసైడ్ బాంబర్ వీడియోలు తొలగించిన META

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్ బాంబర్ ఉమర్ సెల్ఫీ వీడియో SMలో వైరలైన విషయం తెలిసిందే. వాటిని META సంస్థ తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించింది. తమ యూజర్ గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘నాది ఆత్మహత్య కాదు.. <<18318092>>బలిదానం<<>>’ అని ఉమర్ ఆ వీడియోలో సమర్థించుకున్నాడు. అయితే ఈ వీడియో ట్విటర్‌లో అందుబాటులోనే ఉండటం గమనార్హం.

News November 19, 2025

త్వరలో పంచాయతీ ఎన్నికలు.. ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్

image

TG: గ్రామ పంచాయతీల్లో ఓటరు సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. సెప్టెంబర్ 2న ప్రచురితమైన జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే రేపు(ఈ నెల 20) అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాటిపై DPO పరిశీలన చేస్తారని పేర్కొంది. ఈ నెల 23న తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని వెల్లడించింది. త్వరలోనే GP ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.