News April 29, 2024

ఇంటింటికీ పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు: CBN

image

AP: ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. పెన్షన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, ఫోన్లు లేని వారికి నగదు పడిందో? లేదో? ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.

Similar News

News January 11, 2026

ట్రంప్ టారిఫ్స్.. TNలో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

image

ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్‌టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. 30 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. MSMEలు మూతబడేలా ఉన్నాయి’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసు చెప్పారు. వస్త్ర రంగం కోసం ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.

News January 11, 2026

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

image

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. NZతో తొలి వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించారు. సచిన్ 34,357 (782 ఇన్నింగ్సులు) పరుగులతో తొలి స్థానంలో ఉండగా, కోహ్లీ 28,027* (624 ఇన్నింగ్సులు) రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత వేగంగా 28వేలకు పైగా రన్స్ (సచిన్ 644 ఇన్నింగ్సులు) చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచారు.

News January 11, 2026

ఇక కేరళ వంతు.. BJP పవర్‌లోకి వస్తుంది: అమిత్ షా

image

2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో BJP అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘2014లో 11% ఓట్లు వస్తే 2024లో 20%కి పెరిగాయి. త్వరలో 40% సాధిస్తాం. కేరళ వంతు వచ్చింది. ఇక్కడ కచ్చితంగా బీజేపీ సీఎం ఎన్నికవుతారు’ అని చెప్పారు. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీజేపీ-ఎన్డీయే అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.