News May 25, 2024
పిన్నెల్లిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు: జీవీ ఆంజనేయులు

AP: మాచర్ల YCP MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. సీఐని కొట్టి గాయపరిచినా అరెస్ట్ చేసేందుకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ‘ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమే పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. పోలీసులు కౌంటింగ్ రోజునైనా రక్షణ కల్పిస్తారా?’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News November 25, 2025
అఫ్గాన్పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్.. 10 మంది మృతి

అఫ్గానిస్థాన్తో వివాదం వేళ ఆ దేశంపై పాకిస్థాన్ అర్ధరాత్రి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఖోస్త్, పాక్టికా, కునార్ ప్రావిన్స్లో మిస్సైల్స్తో విరుచుకుపడింది. దీంతో 10 మంది అఫ్గాన్ పౌరులు మరణించగా నలుగురు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది చిన్నారులే కావడం విషాదకరం. అఫ్గాన్ తమను లెక్కచేయకపోవడం, భారత్కు దగ్గరవుతుండటాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి దొంగదెబ్బ తీసింది.
News November 25, 2025
చైనా ఎఫ్డీఐలపై ఆంక్షల సడలింపునకు కేంద్రం యోచన

చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI)పై పెట్టిన ఆంక్షలను కాస్త సడలించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్టుల విషయంలో అనుసరిస్తున్న కఠిన నిబంధనలను సడలించాలని అనుకుంటున్నట్టు సమాచారం. కేంద్ర క్యాబినెట్ పరిశీలనకు అధికారులు ఒక నోట్ రెడీ చేశారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2020లో గల్వాన్ బార్డర్ ఘర్షణ తర్వాత చైనా ఎఫ్డీఐలపై ఆంక్షలు విధించింది.
News November 25, 2025
తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

AP: మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడి మరో 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని.. 30వ తేదీన ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


