News May 2, 2024
రాహుల్ను అందుకే ఎంపిక చేయలేదు: సెలక్టర్

T20 WCకు KL రాహుల్ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు. ‘రాహుల్ IPLలో ఓపెనింగ్ చేస్తున్నాడు. కానీ మాకు మిడిలార్డర్ బ్యాటర్లు కావాలి. అందుకు పంత్, శాంసన్ సరైన ఎంపికని భావించాం. శాంసన్ ఏ ప్లేస్లో అయినా రాణించగలడు. జట్టుకు ఎవరు అవసరమనేదే చూశాం. ఎవరు బెటర్ అని కాదు’ అని తెలిపారు. కాగా ఇటీవల ప్రకటించిన 15 మంది సభ్యులు గల స్క్వాడ్లో రాహుల్కు చోటు దక్కకపోవడం గమనార్హం.
Similar News
News December 12, 2025
చివరి దశకు ‘పెద్ది’ షూటింగ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి HYDతో కొత్త షూటింగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వచ్చే నెల చివరికల్లా టాకీ పార్ట్ పూర్తవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ నుంచి రిలీజైన చికిరీ సాంగ్ ఇప్పటికే వ్యూస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్ కానుంది.
News December 12, 2025
ఇందుకేనా శాంసన్ని పక్కన పెట్టారు: నెటిజన్స్

SAతో టీ20 సిరీస్కి గిల్ ఎంపిక సెలక్టర్లకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. VC కావడం, ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా తీర్చిదిద్దాలనే శాంసన్ని పక్కనపెట్టి గిల్కు అవకాశం ఇస్తున్నారు. తీరా చూస్తే పేలవ ప్రదర్శనతో (రెండు టీ20ల్లో 4, 0 రన్స్) నిరాశపరుస్తున్నారు. దీంతో సంజూ ఫ్యాన్స్, నెటిజన్స్ సెలక్టర్లపై మండిపడుతున్నారు. ‘గిల్ కోసం శాంసన్, జైస్వాల్కే కాదు. టీమ్కీ అన్యాయం చేస్తున్నారు’ అంటూ ఫైరవుతున్నారు.
News December 12, 2025
3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

PM మోదీ ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు PM ముందుగా ఆ దేశానికి వెళ్తారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ భేటీ కీలకం కానుంది. అక్కడి నుంచి ఇథియోపియా వెళ్తారు. ఆ దేశానికి ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశంలో చర్చల అనంతరం ఒమన్ చేరుకొని తిరుగు పయనమవుతారు.


