News October 13, 2024
ఇసుక ధరలు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?: జగన్
AP: భరించలేని ఇసుక రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అది కూడా లేదు. పేరుకే ఉచితం కానీ వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా మీదుగా నడుస్తోంది. మేము టన్ను ఇసుక రూ.475కు సరఫరా చేశాం. ఇందులో నేరుగా రూ.375 ఖజానాకు వచ్చేవి. మా హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?’ అని జగన్ ట్వీట్ చేశారు.
Similar News
News October 14, 2024
ఓలాపై సెటైరికల్ ట్వీట్.. మామూలుగా లేదుగా!
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా పేలిపోతున్నాయ్, సర్వీస్ బాగుండట్లేదంటూ ఎప్పటినుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన సెటైరికల్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ దసరాకు దేశవ్యాప్తంగా సంతోషాలు పంచుతామంటూ డెలివరీకి సిద్ధంగా ఉన్న స్కూటర్ల ఫొటోలను ఓలా ట్వీట్ చేసింది. ‘దయచేసి ఢిల్లీ NCRకు డెలివరీ చేయకండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఢిల్లీలో బాణసంచాను బ్యాన్ చేసింది’ అని రిప్లై ఇచ్చాడు.
News October 14, 2024
BREAKING: భారత్ ఓటమి.. WC నుంచి ఔట్?
T20 WC: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 142 పరుగులకే పరిమితమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (54*) చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. లాస్ట్ ఓవర్లో టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. రేపు PAKపై జరిగే మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ ఇంటికి వెళ్లినట్లే.
News October 14, 2024
భూకేటాయింపులపై ఖర్గే కీలక నిర్ణయం!
ముడా స్కాంలో కర్ణాటక CM సిద్ధ రామయ్యపై ED కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు KT ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను తిరిగివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇందులో అవకతవకలు జరిగాయంటూ ఓ వ్యక్తి గవర్నర్కు ఫిర్యాదు చేశారు.