News July 22, 2024

సివిల్స్‌లో దివ్యాంగుల కోటా ఎందుకుండాలి?: స్మితా సబర్వాల్

image

TG: సివిల్ సర్వీసెస్‌కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది. కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలవా? పౌరసేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవి. ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. వీటిలో రిజర్వేషన్ ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఆమె ట్వీట్‌ దుమారాన్ని రేపుతోంది.

Similar News

News December 22, 2025

రంపచోడవరం జిల్లాలో పోలవరం కలపాలని ‘మన్యం బంద్’

image

రంపచోడవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గాన్ని కలపాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు సోమవారం ‘మన్యం బంద్’ నిర్వహించాయి. బుట్టాయగూడెం ఏజెన్సీ నుంచి రంపచోడవరం వరకు వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పోలవరం లేకుండా జిల్లా చేయడం వల్ల ప్రయోజనం లేదని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. బంద్ కారణంగా రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు.

News December 22, 2025

వల్వల్ పెయిన్ గురించి తెలుసా?

image

నార్మల్ డెలివరీ తర్వాత చాలామందికి యోని దగ్గర నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్, కారణం లేకుండా నొప్పి వస్తుంటే దాన్ని వల్వల్ పెయిన్ అంటారు. ప్రసవ భయం, ఒత్తిడి వల్ల ఈ నొప్పి రావొచ్చు. సరైన చికిత్స తీసుకోకపోతే ఇది దీర్ఘకాలం ఉంటుంది. గైనకాలజిస్ట్‌ని కలిస్తే వెజైనల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేస్తారు. అది నెగటివ్ వస్తే పెల్విక్ ఫ్లోర్ మజిల్ వ్యాయామాలు సూచిస్తారు. నొప్పిగా ఉంటే సబ్బులు, వెజైనల్ వాష్‌లు వాడకూడదు.

News December 22, 2025

ఆరావళి పర్వతాలపై కేంద్రం క్లారిటీ

image

ఆరావళి పర్వతాలలో గనుల తవ్వకాల కోసం వాటి నిర్వచనాన్ని మార్చారని వస్తున్న <<18631068>>ఆరోపణల<<>>పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆరావళి విస్తీర్ణంలో 90 శాతానికి పైగా రక్షిత ప్రాంతంగానే ఉంటుందని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. ఆరావళి పర్వతాల మైనింగ్‌పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 1.44 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో కేవలం 0.19% పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు.