News September 11, 2025
మహాలయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణాలు ఎందుకు పెట్టాలి?

పితృదేవతల ఆశీస్సుల కోసం మహాలయ పక్షాల్లో తర్పణాలు వదలాలి. ఈ సమయంలో పితృలోకాల నుంచి వారు మనకు దగ్గరగా వస్తారని, తమ సంతానం పెట్టే తర్పణాలను స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ‘తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయడం వల్ల వారి ఆత్మలు శాంతిని పొందుతాయి. వారు సంతుష్టులై, మన కుటుంబానికి సంతోషం, సౌభాగ్యం, వంశాభివృద్ధిని ప్రసాదిస్తార’ని పండితులు చెబుతున్నారు. ఈ కర్మలు వారికి ఉత్తమగతులు కల్పిస్తాయని అంటున్నారు.
Similar News
News March 17, 2026
అసెంబ్లీ నుంచి స్పీకర్ వాకౌట్!

ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయడం కామన్. కానీ స్పీకరే వాకౌట్ చేస్తే..? కర్ణాటక అసెంబ్లీలో జరిగిందీ ఘటన. 230 ప్రశ్నల్లో 84 ప్రశ్నలకే మంత్రులు సమాధానాలు ఇవ్వడంతో స్పీకర్ UT ఖాదర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. MLAల ప్రశ్నలకు బదులివ్వాల్సిన మంత్రులే సభకు రావడం లేదని విమర్శించారు. దీనిపై వివరణ ఇచ్చేదాకా సెషన్ నడపబోనని వాయిదా వేసి తన ఛాంబర్కు వెళ్లిపోయారు. CM సిద్దరామయ్య సర్దిచెప్పడంతో తిరిగి వచ్చారు.
News March 17, 2026
ట్రంప్కు భారీ షాక్

హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని US అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన <<19394650>>పిలుపునకు<<>> మిత్ర దేశాలు, చైనా ససేమిరా అన్నాయి. ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని నాటో దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్తోపాటు జపాన్ తేల్చిచెప్పాయి. అక్కడికి యుద్ధ నౌకలను పంపబోమని స్పష్టం చేశాయి. ముందు దాడులను ఆపాలని చైనా సూచించింది. తమకు సహకరించకపోతే నాటోకు భవిష్యత్తు ఉండదని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
News March 17, 2026
సినిమా పైరసీ చేస్తే మూడేళ్ల జైలు!

TG: రాష్ట్రంలో సినిమా పైరసీని కట్టడి చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు చేపడుతోంది. మూవీ పైరసీ చేస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రూ.3 లక్షల వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ తప్పదని CSB డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో కలిసి సంయుక్తంగా యాంటీ పైరసీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


