News March 9, 2025

ఇంత తప్పుడు ప్రచారం ఎందుకు?: YCP

image

AP: అమరావతికి నిధుల కేటాయింపుపై వైసీపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘అధికారంలోకి రాగానే ఆఘమేఘాల మీద అమరావతి అభివృద్ధికి రూ.6000 కోట్లు కేటాయించారు. ఆ డబ్బు ఎడాపెడా ఖర్చు చేసేసి ఆ తర్వాత అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని ఊదరగొట్టారు. ఇప్పుడు ఇదే నిధులు భూస్వాముల పెన్షన్లకు అని కబుర్లు చెబుతున్నారు. ఇంత తప్పుడు ప్రచారం ఎందుకు? ప్రజల కళ్లకు గంతలు కట్టడానికా?’ అని CM చంద్రబాబును YCP ప్రశ్నించింది.

Similar News

News March 10, 2025

కెప్టెన్‌గా రోహిత్ శర్మ గెలిచిన ట్రోఫీలు ఇవే

image

☞ IPL: 2013, 2015, 2017, 2019, 2020 (MI)
☞ CL టీ20: 2013
☞ ఆసియా కప్: 2018, 2023
☞ నిదహాస్ ట్రోఫీ-2018
☞ టీ20 వరల్డ్ కప్-2024
☞ ఛాంపియన్స్ ట్రోఫీ-2025

News March 10, 2025

NZ అంటే చాలు.. రెచ్చిపోతాడు!

image

వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ జట్టుపై శ్రేయస్ వరుసగా 103, 52, 62, 80, 49, 33, 105, 79, 48 రన్స్ చేశారు. అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు (243) చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఈ టోర్నీలో ఆయన 15, 56, 79, 45, 48 రన్స్ సాధించారు.

News March 9, 2025

భారత జట్టుకు అభినందనల వెల్లువ

image

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమ్ ఇండియా మరోసారి తన సత్తా చాటిందని, గర్వపడేలా చేసిందని AP సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

error: Content is protected !!