News October 13, 2024

ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు: బండి

image

TG: రాష్ట్రంలో కులగణన అంతా ఫేక్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఓడిపోతామని గ్రహించి స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ‘రూ.150 కోట్లతో కులగణన అంటూ డైవర్షన్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసింది. మళ్లీ గణన ఎందుకు? ఆ నివేదికను గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కార్ విడుదల చేయలేదు. ఇద్దరి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి?’ అని నిలదీశారు.

Similar News

News December 19, 2025

జీవితఖైదు వేసే అధికారం సెషన్స్ కోర్టుకు లేదు: సుప్రీం కోర్టు

image

జీవితఖైదు శిక్ష విధించే అధికారం కేవలం రాజ్యాంగబద్ధ కోర్టులకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ విధించడం, కోర్టులు వేసిన శిక్ష తగ్గించే అధికారాలు సెషన్ కోర్టులకు లేవని జస్టిస్ అహ్సానుద్దిన్ అమానుల్లా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల బెంచ్ చెప్పింది. లైంగిక కోరిక తీర్చడానికి నిరాకరించడంతో మహిళకు నిప్పంటించి చంపేసిన కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది.

News December 19, 2025

విశాఖ రుషికొండ బిల్డింగ్‌పై జగన్ ఏమన్నారంటే?

image

AP: మెడికల్‌ కాలేజీల అంశంపై గవర్నర్‌ను కలిసిన అనంతరం YCP చీఫ్ జగన్ విశాఖ రుషికొండ నిర్మాణాలపై స్పందించారు. ‘మా హయాంలో రుషికొండపై రూ.230CRతో బ్రహ్మాండమైన బిల్డింగ్‌ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికమైంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు యోగా డే కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామగ్రి కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు.

News December 19, 2025

డిసెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

* 1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై అప్పటి PM నెహ్రూ ప్రకటన
* 1961: పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించిన భారత సైన్యం
* 1974: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ జననం
2015: సినీ నటుడు, కవి రంగనాథ్ మరణం(ఫొటోలో)
– గోవా విముక్తి దినోత్సవం