News October 17, 2024
టెస్టు ఫస్ట్ డే త్వరగా ఎందుకు నిలిపేశారంటే…

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ను మధ్యాహ్నం రెండున్నరకే నిలిపేసిన సంగతి తెలిసిందే. హాక్ ఐ సాంకేతికతను ఇన్స్టాల్ చేసేందుకు టైమ్ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందురోజే దాన్ని అమర్చాల్సినప్పటికీ వర్షం కారణంగా సాధ్యం కాలేదు. దాన్ని అమర్చేందుకు సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఒకవేళ మధ్యాహ్నం వర్షం ఆగిపోయినా హాక్ ఐ అమర్చేసరికి సాయంత్రం అవుతుంది కాబట్టే ఆటను త్వరగా రద్దు చేశారు.
Similar News
News November 6, 2025
20న తిరుపతికి రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 20, 21 తేదీల్లో తిరుపతిలో పర్యటించనున్నారు. 20న తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆమె దర్శించుకుంటారు. 21న తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అదేరోజు శ్రీ వరాహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 6, 2025
రాహుల్ ఆరోపించిన చోట కాంగ్రెస్కే అధిక ఓట్లు

హరియాణాలో భారీగా ఓటు చోరీ జరిగిందని నిన్న LoP రాహుల్ గాంధీ ECపై ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. ములానా సెగ్మెంటు ఢకోలా గ్రామంలో ఒకే ఫొటో (బ్రెజిలియన్ మోడల్)తో 223 ఓట్లున్నట్లు చూపారు. అయితే 2024 పోలింగ్లో అక్కడ CONGకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో BJPకి 275, CONGకు 602 ఓట్లు రాగా లోక్సభలో BJP కన్నా CONGకు 392 ఓట్లు ఎక్కువొచ్చాయి. 2019తో పోలిస్తే 2024లో కాంగ్రెస్కే అధిక ఓట్లు పడ్డాయి.
News November 6, 2025
20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్

బిహార్ భీమ్బంద్ ప్రాంతంలోని 7 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజలు 20 ఏళ్ల తరువాత తొలిసారి ఓట్లు వేశారు. 2005 JAN 5న తారాపూర్ దగ్గర భీమ్ బంద్ ప్రాంతంలో నక్సల్స్ పోలీసులు లక్ష్యంగా ల్యాండ్మైన్ పేల్చారు. పేలుడులో ముంగేర్ SP సురేంద్ర బాబు, ఆరుగురు పోలీసులు చనిపోయారు. అప్పటి నుంచి అధికారులు అక్కడ పోలింగ్ నిర్వహించడం లేదు. ఈసారి సాయుధ దళాలను మోహరించి పోలింగ్ జరిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారు.


