News October 17, 2024
టెస్టు ఫస్ట్ డే త్వరగా ఎందుకు నిలిపేశారంటే…

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ను మధ్యాహ్నం రెండున్నరకే నిలిపేసిన సంగతి తెలిసిందే. హాక్ ఐ సాంకేతికతను ఇన్స్టాల్ చేసేందుకు టైమ్ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందురోజే దాన్ని అమర్చాల్సినప్పటికీ వర్షం కారణంగా సాధ్యం కాలేదు. దాన్ని అమర్చేందుకు సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఒకవేళ మధ్యాహ్నం వర్షం ఆగిపోయినా హాక్ ఐ అమర్చేసరికి సాయంత్రం అవుతుంది కాబట్టే ఆటను త్వరగా రద్దు చేశారు.
Similar News
News December 1, 2025
కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News December 1, 2025
ఎయిమ్స్ రాజ్కోట్లో ఉద్యోగాలు

ఎయిమ్స్ రాజ్కోట్లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్సైట్: https://aiimsrajkot.edu.in/
News December 1, 2025
బుల్ జోరు.. స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డులు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 26,325, సెన్సెక్స్ 86,159 పాయింట్లతో ఆల్ టైమ్ హై టచ్ చేశాయి. బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 60K మార్క్ క్రాస్ చేసింది. కొద్ది నిమిషాల క్రితం నిఫ్టీ 80 పాయింట్లు ఎగసి 26,285 వద్ద, సెన్సెక్స్ 313 పాయింట్లు లాభపడి 86,020 వద్ద కొనసాగుతున్నాయి. బెల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, రిలయన్స్, SBI లాభాల్లో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ITC నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


