News March 1, 2025

ప్రియుడితో దాడి చేయించిన భార్య.. మృత్యువుతో పోరాడి భర్త మృతి

image

TG: వరంగల్‌లో 8 రోజులుగా మృత్యువుతో పోరాడి వైద్యుడు సుమంత్ రెడ్డి నేడు చనిపోయారు. FEB 20న ఇతనిపై భార్య మరియా ప్రియుడితో దాడి చేయించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిమ్‌లో శామ్యూల్‌తో మరియాకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో సుమంత్ కాపురాన్ని WGLకు మార్చారు. భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేయగా వీరికి కానిస్టేబుల్ రాజ్ హెల్ప్ చేశాడు. ప్రస్తుతం ముగ్గురూ అరెస్ట్ అయ్యారు.

Similar News

News November 15, 2025

తెలంగాణ హైకోర్టు వెబ్‎సైట్ హ్యాక్

image

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్‎లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్‎సైట్‎లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.

News November 15, 2025

రూ.1,201 కోట్ల పెట్టుబడి.. రేమండ్‌ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

image

AP: సీఐఐ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.1,201 కోట్ల మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రేమండ్ సంస్థ ప్రకటించింది. ఈమేరకు వాటికి సీఎం చంద్రబాబు, సంస్థ ఎండీ గౌతమ్ మైనీ శంకుస్థాపన చేశారు. దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా రేమండ్ పరికరాలు తయారుచేయడం అభినందనీయమని CBN అన్నారు.

News November 15, 2025

యాపిల్‌కు త్వరలో కొత్త CEO.. టిమ్ కుక్ వారసుడు ఎవరు?

image

2011లో స్టీవ్ జాబ్స్ నుంచి టిమ్ కుక్ యాపిల్‌ CEOగా బాధ్యతలు అందుకున్నారు. కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన కుక్.. 2026 ప్రారంభంలో తన వారసుడిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. 2001లో హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన జాన్ టెర్నస్ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టులో పేర్కొంది.