News March 17, 2025

బట్టతలపై భార్య హేళన.. భర్త బలవన్మరణం

image

కర్ణాటకలోని చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత భార్యాభర్తలు. పెళ్లినాటికే బట్టతల ఉన్నప్పటికీ మమత అతడిని వివాహం చేసుకుంది. కానీ పెళ్లయ్యాక మాత్రం ‘నీతో బయటికి వెళ్లాలంటే అవమానంగా ఉంటోంది. తలపై జుట్టూ లేదు చేతిలో డబ్బూ లేదు’ అంటూ నరకం చూపించేది. వరకట్నం కేసు పెట్టి అతడిని నెలన్నరపాటు జైలుకు పంపించింది. తాజాగా బెయిల్‌పై బయటికొచ్చిన మూర్తి, ఆ బాధల్ని తట్టుకోలేక తనువు చాలించాడు.

Similar News

News December 4, 2025

భారత్‌ చేరుకున్న రష్యా డిఫెన్స్ మినిస్టర్.. కాసేపట్లో పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ కాసేపట్లో భారత్‌కు రానున్న నేపథ్యంలో ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌ ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్‌తో కలిసి ఆయన భారత్-రష్యా 23వ సమ్మిట్‌లో పాల్గొంటారు. భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్‌తో ఆండ్రీ భేటీ అవుతారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇరుదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. అటు పుతిన్ భారత్‌‌కు చేరుకున్నాక ప్రెసిడెంట్ ముర్ము ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.

News December 4, 2025

పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

image

TG: పంచాయతీ ఎన్నికలకు SEC భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేలా పలు జిల్లాల్లో పోలీసు బలగాలు గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించి చర్యలు చేపడుతున్నారు. షాద్‌నగర్ పరిధిలోని పలు పంచాయతీల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.

News December 4, 2025

మామిడిలో జింకు లోపం – లక్షణాలు

image

సాధారణంగా చౌడు నేలల్లోని మామిడి తోటల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపముంటే ఆకులు చిన్నవిగా మారి సన్నబడి పైకి లేదా కిందకు ముడుచుకుపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకుల వలే గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.