News January 4, 2025
2020 రిపీట్ అవుతుందా?

కొత్త ఏడాది సరికొత్త వైరస్తో మనకు స్వాగతం పలికిందని, ఇది కూడా 2020 మాదిరిగా మారుతుందేమో అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో జనవరి 1వ తేదీ బుధవారం వచ్చిందని, 2025లోనూ అదే రిపీటైందని చెబుతున్నారు. కరోనా ఎంతో మంది ప్రాణాలను తీయడంతో పాటు ఆర్థికంగా అట్టడుగుకు తోసేసిందని గుర్తుచేసుకుంటున్నారు. HMPV వైరస్ ఇండియాలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News February 3, 2026
మా సహనమే గెలిపించింది: మోదీ

తమ సహనానికి ఫలితమే అమెరికాతో వాణిజ్య ఒప్పందమని PM మోదీ అన్నారు. ‘టారిఫ్స్ను కొందరు విమర్శించారు. కానీ మేం ఓపికగా ఉన్నాం. ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి’ అని NDA పార్లమెంటరీ పార్టీ భేటీలో అన్నారు. ప్రపంచ క్రమం మారుతోందని, ఇండియా వైపు అడుగులు పడుతున్నాయని చెప్పారు. వాణిజ్య ఉద్రిక్తతల మధ్య కూడా ఇండియా ప్రయోజనం పొందుతోందని తెలిపారు. అంతకుముందు ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్వీట్ చేశారు.
News February 3, 2026
అలాగైతే ఇండియా నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్పై సుప్రీం ఆగ్రహం

వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మా దేశ ప్రైవసీపై మీరు ఆటలు ఆడలేరు. ఇక్కడి డేటాలో ఒక్క అక్షరం/అంకె కూడా షేర్ చేయడానికి మేం అనుమతివ్వం’ అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు.
News February 3, 2026
పశువుల పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో పూర్తి వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.


