News August 27, 2024

అవకాశమొస్తే ప్రభాస్‌తో మళ్లీ నటిస్తా: ఈశ్వర్ హీరోయిన్

image

ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’ తనకెంతో ప్రత్యేకమని హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ అన్నారు. ఈ సినిమా అక్టోబర్‌లో రీరిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభాస్ అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారని చెప్పారు. ‘సుందరకాండ’ టీజర్ రిలీజ్ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఒకవేళ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఆయనతో కలిసి నటిస్తానని చెప్పారు. ఈశ్వర్ సినిమా రీరిలీజ్ రోజున మొదటి షో చూస్తానని తెలిపారు.

Similar News

News November 18, 2025

ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

image

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్‌లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్‌లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.

News November 18, 2025

ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

image

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్‌లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్‌లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.

News November 18, 2025

చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

image

అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘Chanel’ గ్లోబల్‌ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌‌లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్‌మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.