News December 11, 2024
మూడోదైనా గెలుస్తారా?

వన్డే సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఇవాళ ఉదయం 9.50 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయిన ఇండియా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమవుతున్న టీమ్ ఇండియా ప్లేయర్లు ఈ మ్యాచ్లోనైనా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News September 17, 2025
ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,000 డ్రైవర్, 743 శ్రామిక్(మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్, ఆటో ఎలక్ట్రిషియన్, పెయింటర్, వెల్డర్, అప్ హోల్స్టర్, మిల్రైట్ మెకానిక్) పోస్టులకు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మరిన్ని వివరాలకు ఇక్కడ <
News September 17, 2025
1-12 తరగతుల వరకు మార్పులు: CM

TG: విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని CM రేవంత్ అన్నారు. నూతన విద్యా విధానం రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. ‘పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గం. 1-12 తరగతుల వరకు మార్పులు జరగాలి. ఎలాంటి నిర్ణయానికైనా నేను సిద్ధం. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోవడానికి నాణ్యత, నైపుణ్యత కొరవడటమే కారణం. మేధావులు, విద్యాధికుల సూచనలతో కొత్త పాలసీ రూపొందించాలి’ అని ఆదేశించారు.
News September 17, 2025
ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా

టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్ చేరారు. ఆటోమేటిక్ ఫైనల్ మార్క్ 84.50 మీ. కాగా ఆయన తొలి అటెంప్ట్లోనే జావెలిన్ను 84.85 మీ. విసిరారు. వెబెర్(జర్మనీ) 87.21 మీ., వెంగెర్(పోలెండ్) 85.67 మీ. విసిరి ఫైనల్లో అడుగుపెట్టారు. ఫైనల్ రేపు జరగనుంది. ఇక 2023లో బుడాపేస్ట్లో జరిగిన ఛాంపియన్షిప్లో నీరజ్ గోల్డ్ కొల్లగొట్టారు.