News March 16, 2024
కుప్పంలో చంద్రబాబుపై భరత్ గెలుస్తాడా…?

వైసీపీ కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్జె.కె.భరత్ను అధికారికంగా శనివారం నియమించారు. 2019 ఎన్నికల్లో ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరణాంతరం కుమారుడు భరత్కు సీఎం జగన్ నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్సీ పదవీ కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో భరత్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొననున్నారు.
Similar News
News January 31, 2026
చిత్తూరు జిల్లాకు రూ.118.65 కోట్ల విడుదల

చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 2,75,073 మందికి రూ.118.65 కోట్లు విడుదలయ్యాయి. గుడుపల్లె మండలం బెగ్గిలిపల్లె పంచాయతీలో సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకెళ్లి పింఛన్లు అందజేయనున్నారు.
News January 31, 2026
నేడు CM చంద్రబాబు పర్యటన వివరాలు

CM చంద్రబాబు శనివారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటకు కడపల్లి ఇంటి నుంచి గుడిపల్లి (M) బెగ్గిలిపల్లిలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. 10:40 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శాంతిపురం (M) తులసి నాయన పల్లి వద్ద ప్రజా వేదిక బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఈ-సైకిళ్ల పంపిణీపై గిన్నిస్ బుక్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది.
News January 31, 2026
చిత్తూరు: ప్లాస్టిక్ వినియోగం తగ్గేనా..!

జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం మళ్లీ అది ఊపందుకుంది. ప్లాస్టిక్ నిషేధం ప్రస్తుతం ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ప్లాస్టిక్ కవర్లను మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వాటి వినియోగం పర్యావరణ పరిరక్షణకు సవాలుగా మారింది. పూర్తిస్థాయిలో జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


