News September 23, 2024
దామచర్ల వ్యాఖ్యలపై పవన్కు ఫిర్యాదు చేస్తా: బాలినేని
AP: తనపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన <<14167036>>వ్యాఖ్యలు<<>> సరికాదని మాజీ MLA బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకి లేఖ రాసినట్లు తెలిపారు. దామచర్ల వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వైసీపీలో ఇబ్బందుల కారణంగానే తాను జనసేనలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26న జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Similar News
News September 23, 2024
ఆపరేషన్ బుడమేరు.. 270 ఎకరాల్లో ఆక్రమణల గుర్తింపు
AP: విజయవాడలో ఆపరేషన్ బుడమేరును చేపట్టేందుకు అధికారులు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణల వివరాలు సేకరిస్తున్నారు. ఎ.కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2,700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తోంది. ఇందులో 270 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 3వేల గృహాలు, 80 నిర్మాణాలను గుర్తించామన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఆపరేషన్ చేపడతామన్నారు.
News September 23, 2024
రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త
TG: అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, మరో తీపికబురు అందించింది. రేషన్ కార్డు ఉన్న వారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరకులు తీసుకోవచ్చని CLP సమావేశంలో CM రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నామని, ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు అందిస్తామన్నారు. ఇన్ఛార్జి మంత్రులు వారంలో రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలని సీఎం సూచించారు.
News September 23, 2024
కామ్రేడ్ దిసనాయకేకు CPI(M) అభినందనలు
శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికైన మార్క్సిస్ట్ నేత అనురకుమార దిసనాయకేకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) అభినందనలు తెలిపింది. శ్రీలంక చరిత్రలో తొలిసారి ఓ కమ్యూనిస్ట్ నేత అధ్యక్ష పీఠంపై కూర్చోనున్న ఈ సందర్భం ఎంతో మహత్తరమైనదని పేర్కొంది. శ్రీలంకను దిసనాయకే ప్రగతి పథంలో నడిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని చెప్పింది.