News September 14, 2024
వంట నూనె ధరలు పెరగనున్నాయా?

కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచింది. దీంతో సన్ఫ్లవర్, సోయా బీన్, రిఫైన్డ్ పామాయిల్పై ఇంపోర్ట్ టాక్స్ 12.5% నుంచి 32.5%కి చేరింది. దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇంపోర్ట్ టాక్స్ పెంపుతో వంట నూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News January 2, 2026
టీవీ రేటింగ్స్.. రికార్డు సృష్టించిన బిగ్బాస్-9

టీవీ రేటింగ్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే రికార్డు సృష్టించినట్లు హోస్ట్ నాగార్జున తెలిపారు. ‘స్టార్ మాలో 19.6 TVR, జియో హాట్స్టార్లో 285M స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయి. గత 5 సీజన్స్లో ఇదే అత్యధికం. ఈ సీజన్ మొత్తం ఎమోషన్స్, ప్యాషన్, కాన్ఫ్లిక్ట్స్, మర్చిపోలేని మూమెంట్స్తో నిండిపోయింది. ప్రేక్షకుల అసాధారణ మద్దతు నిజంగా హిస్టారిక్’ అని ట్వీట్ చేశారు.
News January 2, 2026
ఉపాధి హామీకి కేంద్రం తూట్లు పొడుస్తోంది: భట్టి

TG: ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు ఉంటే తప్పా? అని Dy.CM భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఉపాధి హామీకి BJP తూట్లు పొడుస్తోంది. ఏ వ్యక్తి ఎక్కడైనా పనిచేసే వీలుంటే.. దానిని నిర్దేశిత ఏరియాకి పరిమితం చేసింది. అన్స్కిల్డ్ లేబర్ను దోచుకోకూడదని మేము చట్టం చేస్తే.. నో వర్క్ ఇన్ పీక్ సీజన్ అనడం దోపిడీ కాదా? రైట్ టు వర్క్.. పర్మిట్ టు వర్క్గా మార్చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News January 2, 2026
AP, TG మధ్య ఉన్న జలవివాదాలు ఏంటి?

AP, TG జల <<18742119>>వివాదాలు<<>> దశాబ్దాలుగా ఉన్నాయి. TG విద్యుదుత్పత్తితో శ్రీశైలంలో తమ నీటి వాటా తగ్గుతోందని AP వాదిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి AP ఎక్కువ నీటిని తీసుకుంటోందనేది TG అభ్యంతరం. KWDT-I అవార్డు ప్రకారం AP, TG వాటా 66:34 నిష్పత్తి కాగా తెలంగాణ 50% ఇవ్వాలంటోంది. పాలమూరును AP వ్యతిరేకిస్తోంది. పోలవరం-బనకచర్లకు TG ససేమిరా అంటుండగా గోదావరి మిగులు నీటిపై హక్కు తమదేనని AP వాదిస్తోంది. ఇలా అనేకమున్నాయి.


