News October 6, 2025
పత్తి రైతుకు మద్దతు దక్కుతుందా?

ఈ ఏడాది పత్తి పంట క్వింటాకు రూ.8,110 మద్దతు ధరగా నిర్ణయించారు. సీసీఐ నిబంధనలకు అనుగుణంగా పంటలో తేమ, నాణ్యత ఉంటేనే ఈ ధర వస్తుంది. పత్తిలో గరిష్ఠంగా 8-12% తేమనే CCI అనుమతిస్తోంది. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలు, చీడపీడల వల్ల ఈసారి పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో పాటు నాణ్యత కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల మద్దతు ధర దక్కుతుందో? లేదో? అనే ఆందోళన పత్తి రైతుల్లో నెలకొంది.
Similar News
News March 24, 2026
RDTకి అనుమతులు.. CBN క్రెడిట్ చోరీ: జగన్

AP: RDTకి FCRA <<19461876>>అనుమతుల<<>> విషయంలో CM CBN క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యంగా ఉందని జగన్ ట్వీట్ చేశారు. ‘నిజంగా ఆయన కృషి చేసి ఉంటే 2025 APRలో నిలిచిపోయిన పర్మిషన్ల రెన్యువల్కు ఏడాదికాలం ఎందుకు పట్టింది? CBN పట్టించుకోకపోవడం వల్లే YCP, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా’ అని ప్రశ్నించారు. పర్మిషన్లు రెన్యువల్ చేసినందుకు PM మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.
News March 24, 2026
యుద్ధం.. మోదీకి ట్రంప్ ఫోన్

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియా యుద్ధం, రెండు దేశాలపై దాని ప్రభావం గురించి ఇద్దరు నేతలు చర్చించారు. హార్ముజ్లో నౌకలు చిక్కుకోవడం, జలసంధిని తెరిపించాల్సిన అవసరంపై మాట్లాడుకున్నారు. మరోవైపు యుద్ధం వల్ల దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని మోదీ ఇప్పటికే దేశ <<19465598>>ప్రజలకు<<>> పిలుపునిచ్చారు.
News March 24, 2026
పుదుచ్చేరి పీఠం ఎవరిదో? – 1/2

నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి భవితవ్యం కూడా ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) ఆధ్వర్యంలోని NDA మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది. అయితే AINRC-BJP దోస్తీ కాస్త సడలిందనే టాక్ నడుస్తోంది. అమిత్ షా బుజ్జగింపుతో AINRC చీఫ్, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి శాంతించినా విజయ్ TVK ఎంట్రీ, రాష్ట్ర హోదా డిమాండ్ హాట్ టాపిక్గా మారింది. <<-se>>#Elections2026<<>>


