News October 5, 2024
పెరగనున్న పత్తి ధరలు?

TG: రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం మార్కెట్లో నిన్న కొత్త పత్తి క్వింటాల్కు గరిష్ఠంగా ₹7,111, మోడల్ ధర ₹6,500, కనిష్ఠంగా ₹4,500 పలికింది. పాత పత్తికి గరిష్ఠంగా ₹7550, కనిష్ఠ ధర ₹4,500గా ఉంది. వరంగల్ మార్కెట్లో గరిష్ఠంగా ₹7,600, మోడల్ ₹6,600, కనిష్ఠ ధర ₹5,500 వరకు పలికిందని, కొత్త పత్తి ₹7,600కు పైగానే పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.
Similar News
News January 11, 2026
సంక్రాంతి.. YCP vs TDP

సంక్రాంతి వేళ ఏపీకి వస్తున్న ప్రజలు సొంతూరి దుస్థితి చూసి నిట్టూరుస్తున్నారని YCP ట్వీట్ చేసింది. గుంతల రోడ్లు, మద్దతు ధర లేక రైతులు పంటను రోడ్లపై పారేస్తున్నారని ఓ ఫొటోను షేర్ చేసింది. ఏడాదిన్నరలోనే ఇలా భ్రష్టు పట్టించేశారేంటని మాట్లాడుకుంటున్నారని పేర్కొంది. దీనికి టీడీపీ కౌంటర్ ట్వీట్ చేసింది. పోలవరం, అమరావతి వేగంగా పూర్తవుతున్నాయని, ఏపీ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని మరో ఫొటో షేర్ చేసింది.
News January 11, 2026
Bullet Train: ఆలస్యం ఖరీదు ₹88వేల కోట్లు!

ఇండియాలో తొలి బుల్లెట్ రైలు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రాజెక్టు నాలుగేళ్లు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం ఏకంగా 83% పెరిగింది. దాదాపు ₹1.1 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా తాజాగా ₹1.98 లక్షల కోట్లకు అంచనా పెరిగింది. ఇప్పటిదాకా ₹85,801 కోట్లు ఖర్చయ్యాయి. సూరత్, బిలిమోరా మధ్య <<18733757>>తొలి విడతలో <<>>2027 ఆగస్టులో ట్రైన్ పట్టాలెక్కనుంది. 508KM మొత్తం ప్రాజెక్టు(ముంబై-అహ్మదాబాద్) 2029 డిసెంబర్కు పూర్తి కానుంది.
News January 11, 2026
మెగా158.. హీరోయిన్గా ఐశ్వర్యరాయ్?

చిరంజీవి తర్వాతి మూవీ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇందులో చిరు సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మెగాస్టార్తో మాజీ ప్రపంచసుందరి తొలిసారి నటించే అవకాశముంది. అటు ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంకా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని టాక్. ఈ సారి మెగాస్టార్ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.


