News November 7, 2024
BRS, కాంగ్రెస్ను ఖతం చేస్తాం: కిషన్రెడ్డి

TG: రాష్ట్రంలో BRS, కాంగ్రెస్ను ఖతం చేస్తామని BJP నేత, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్నారు. కేటీఆర్ వైఖరి వల్ల BRS పైనా వ్యతిరేకత పోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనను తాము తప్పుబట్టడం లేదని ఆయన తెలిపారు. మూసీ నది పునరుజ్జీవం కోసం ఇళ్లు కూల్చవద్దని, నదికి రక్షణ గోడ నిర్మించాలని సూచించారు.
Similar News
News November 2, 2025
ఆ ఓటర్లను ‘స్థానిక’ జాబితాలో చేర్చండి: SEC

TG: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికల కసరత్తులో భాగంగా GP వార్డుల వారీగా కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని కలెక్టర్లను SEC ఆదేశించింది. గతనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈనెల 15 వరకు నమోదయ్యే ఓటర్లను లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓట్ లిస్ట్లో చేర్చాలని సూచించింది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ముందుజాగ్రత్తగా సిద్ధం చేయాలని ఆదేశించింది.
News November 2, 2025
తాజా తాజా

➤ హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్కులో వాకర్స్తో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
➤ HYD కేబీఆర్ పార్కులో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్
➤ SRSP 16 గేట్లు ఎత్తి 47,059 క్యూసెక్కులు.. నిజాంసాగర్ 5 గేట్లు ఎత్తి 33,190 క్యూసెక్కుల నీరు విడుదల
➤ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘NBK111’ హీరోయిన్ను రేపు 12.01pmకు రివీల్ చేయనున్న మేకర్స్.
News November 2, 2025
ఫైబర్ ఎందుకు తీసుకోవాలంటే..

మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాల్లో ఫైబర్ ఒకటి. ఇవి రెండు రకాలు. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, రెండోది ఇన్ సాల్యుబుల్ ఫైబర్. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, మలబద్దకం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ నియంత్రణలో ఉంటాయి. పురుషులకు రోజుకు 30 గ్రా., స్త్రీలకు 25 గ్రా., 2-5 ఏళ్ల పిల్లలకు 15 గ్రా., 5-11 ఏళ్లు పిల్లలకు 20 గ్రా. ఫైబర్ అవసరం అవుతుంది.


