News June 20, 2024
సంపద పెరిగినా ఆర్థిక అసమానతలు పోవా?
శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత్ తన జోరును కొనసాగిస్తుందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అయితే ఆర్థిక అసమానతలను ఈ వృద్ధి తగ్గించలేదని అభిప్రాయపడ్డారు. రాయిటర్స్ సంస్థ నిర్వహించిన పోల్లో నిపుణులు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఆర్థిక అసమానతలను ప్రధాన సమస్యగా పరిగణించట్లేదని పేర్కొన్నారు. కాగా వీరిలో పలువురు ఈ ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News October 8, 2024
GATE-2025 గడువు పొడిగింపు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్-2025కు దరఖాస్తు గడువు తేదీని అధికారులు మరోసారి పొడిగించారు. గతంలో ప్రకటించినదాని ప్రకారం అక్టోబర్ 3నే గడువు ముగియాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. డెడ్లైన్ పొడిగించడం ఇది రెండోసారి. తొలుత సెప్టెంబర్ 26నే గడువు తేదీగా ప్రకటించారు. gate2025.iitr.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
News October 8, 2024
అవినీతి జగన్పై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి: భాను ప్రకాశ్
AP: అవినీతి సొమ్ము ఎలా సంపాదించాలనే విషయంలో జగన్ దేశానికే ఓ రోల్ మోడల్ అని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఆరోపించారు. ‘APని జగన్ నాశనం చేసిన తీరుపై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి. తిరుమలలో కమీషన్లు తీసుకున్న ఘనత గత ప్రభుత్వానిది. TTDకి చెందిన కొన్ని రిజర్వేషన్లలో YV సుబ్బారెడ్డి మార్పులు తెచ్చింది వాస్తవం కాదా? తిరుమలలో ఫొటోషూట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
News October 8, 2024
ఒమర్ అబ్దుల్లానే సీఎం: ఫరూక్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఈనేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ తదుపరి సీఎం అని ప్రకటించారు.