News October 26, 2024

మరికొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తా: ధోనీ

image

MS ధోనీ IPLలో కొనసాగుతారా? లేదా? అనే దానిపై సస్పెన్స్ వీడింది. తాను వచ్చే IPLలో ఆడుతానని MSD స్పష్టం చేశారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ధోనీ తాను మరికొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తానని చెప్పారు. మైదానంలో ప్రొఫెషనల్ గేమ్‌గా ఆడితేనే విజయం సాధించగలమని అన్నారు. T20WC ఫైనల్ మ్యాచ్‌పై స్పందిస్తూ క్రికెట్లో చివరి వరకూ ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కాగా తలా తాజా వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Similar News

News November 29, 2025

మావోయిస్ట్ కీలక నేత అనంత్ అస్త్ర సన్యాసం

image

మావోయిస్టు పార్టీ కీలక నేతల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 15 మంది నక్సల్స్ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. జనవరి 1న సాయుధ విరమణ చేస్తున్నట్టు నిన్న లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం.

News November 29, 2025

‘ఒక్క రూపాయి లేదు.. కొంచెం క్యాష్ పెట్టండి’

image

తిరునెల్వేలి (TN)లో ఓ దొంగ రాసిన లేఖ SMలో వైరల్ అవుతోంది. జేమ్స్ పాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మదురైకి వెళ్లారు. అనంతరం ఫోన్‌లో చెక్ చేయగా ఇంటి CCTV పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి పొరుగువారికి కాల్ చేశారు. వారు వెళ్లి చూసేసరికి తలుపు పగిలి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల పరిశీలనలో ఓ లేఖ దొరికింది. “ఇంట్లో ఒక్క రూపాయి లేదు. ఎందుకు ఇన్ని కెమెరాలు. కొంచెం అయినా క్యాష్ పెట్టండి” అంటూ రాసుకొచ్చాడు.

News November 29, 2025

‘ఒక్క రూపాయి లేదు.. కొంచెం క్యాష్ పెట్టండి’

image

తిరునెల్వేలి (TN)లో ఓ దొంగ రాసిన లేఖ SMలో వైరల్ అవుతోంది. జేమ్స్ పాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మదురైకి వెళ్లారు. అనంతరం ఫోన్‌లో చెక్ చేయగా ఇంటి CCTV పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి పొరుగువారికి కాల్ చేశారు. వారు వెళ్లి చూసేసరికి తలుపు పగిలి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల పరిశీలనలో ఓ లేఖ దొరికింది. “ఇంట్లో ఒక్క రూపాయి లేదు. ఎందుకు ఇన్ని కెమెరాలు. కొంచెం అయినా క్యాష్ పెట్టండి” అంటూ రాసుకొచ్చాడు.