News November 5, 2024
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ మారుస్తారా?

AP: జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను అభ్యర్థుల వినతి మేరకు వాయిదా వేయడంపై అధికారులు చర్చిస్తున్నారు. DSC పరీక్షల తేదీలను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని, డీవైఈవో పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీలు చిరంజీవి, లక్ష్మణరావు APPSC ఛైర్పర్సన్ అనురాధకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 17, 2026
వెంకీ-కార్తీతో అనిల్ క్రేజీ మల్టీస్టారర్?

వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి కలిసి వర్క్ చేయనున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్లో కీలక పాత్ర కోసం తొలుత ఫహాద్ ఫాజిల్ పేరు వినిపించింది. ఇప్పుడు తమిళ స్టార్ కార్తీ పేరు తెరపైకి వచ్చింది. ‘బామ్మర్ది బాలిరెడ్డి’ టైటిల్ ప్రచారంలో ఉంది. జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. పూజా హెగ్డే, కీర్తి సురేశ్ హీరోయిన్లని టాక్. 2027 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News February 17, 2026
త్వరలో హాస్టళ్లలోని 1,433 పోస్టుల భర్తీ: సవిత

AP: సంక్షేమ హాస్టళ్లలోని 1,433 కుక్, లేబర్, పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నామని మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. ‘142 కుక్, లేబర్, 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం. కొత్తగా 10 MJP BC గురుకులాలను నెలకొల్పుతాం. 6 గురుకుల స్కూళ్లను కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం. పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లకోసం ₹420CR, ఫీజు రీయింబర్స్మెంట్కు ₹933 CR కేటాయించాం’ అని వివరించారు.
News February 17, 2026
అజిత్ పవార్ మృతి.. కీలక పరిణామం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ <<19106331>>మృతి కేసులో<<>> కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంపై సీబీఐ విచారణ చేయాలని ఆయన భార్య, Dy.CM సునేత్రా పవార్ డిమాండ్ చేశారు. NCP లీడర్లు, పెద్ద కుమారుడు పార్థ్తో ఆమె సీఎం ఫడణవీస్ను కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. ‘ఈ విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తామన్నారు’ అని NCP నేత సునీల్ వెల్లడించారు.


