News October 20, 2024
2028లోపు మళ్లీ సీఎం అవుతా: కుమార స్వామి
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, దీనికి ఆ పార్టీలోని అంతర్గత సమస్యలే కారణమవుతాయని కేంద్ర మంత్రి కుమారస్వామి జోస్యం చెప్పారు. 2028లోపు తాను మళ్లీ సీఎం పీఠం ఎక్కడం ఖాయమన్నారు. తానేమీ జ్యోతిషుడిని కాకపోయినా ఈ మాట కచ్చితంగా చెబుతున్నానని పేర్కొన్నారు. ఈసారైనా ఐదేళ్లు సీఎం పదవిలో ఉండే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈయన FEB 2006-OCT 2007, మే 2018- జులై 2019 మధ్య రెండుసార్లు CMగా పనిచేశారు.
Similar News
News October 20, 2024
బద్వేల్ ఘటన.. కీలక విషయాలు వెలుగులోకి
AP: <<14403526>>బద్వేల్ ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో యువతిని అడ్డు తొలగించేందుకు నిందితుడు విఘ్నేశ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు విచారణలో ప్రాథమికంగా తేల్చారు. ఆ యువతి అతనికి చిన్నతనం నుంచే పరిచయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల విఘ్నేశ్కు వేరొకరితో వివాహమైంది. ఈ క్రమంలో పథకం ప్రకారమే యువతిని బైక్పై తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పేర్కొన్నారు.
News October 20, 2024
ప్రభాస్ బర్త్ డే.. CDP విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా కామన్ డీపీ విడుదలైంది. ఈనెల 23న ఇదే ఫొటోను ప్రభాస్ అభిమానులంతా తమ సోషల్ మీడియా అకౌంట్ల డిస్ప్లే పిక్చర్గా పెట్టుకోనున్నారు. కల్కిలో విల్లుతో ఉన్న ప్రభాస్ ఫొటోతో పాటు ఆదిపురుష్, సలార్, బాహుబలి, రాజాసాబ్ లుక్స్ను ఉంచారు. ఇందులో ‘స్టారంటే రెబలేరా’ ట్యాగ్లైన్ హైలైట్. బర్త్ డే సందర్భంగా ‘సలార్’, ఈశ్వర్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు రీరిలీజవుతున్నాయి.
News October 20, 2024
BREAKING: భారత్ పరాజయం
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచులో భారత్ పరాజయం పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన NZ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యంగ్(45*), రవీంద్ర(39*) జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటవ్వగా, రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు NZ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.