News August 29, 2024
త్వరలో శుభవార్త వింటారు: మంత్రి లోకేశ్

AP: ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖలో ఏపీ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ‘మెరుగైన IT పాలసీని తీసుకువస్తాం. దేశంలో టాప్ కంపెనీలతో చర్చిస్తున్నాం. త్వరలో శుభవార్త వింటారు. ISB తరహాలో విశాఖలో ప్రపంచస్థాయి AI వర్సిటీని ఏర్పాటు చేస్తాం. రాబోయే ఐదేళ్లలో విశాఖను 100 బిలియన్ డాలర్ల ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుతాం’ అని తెలిపారు.
Similar News
News January 26, 2026
కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీలు.. 11 మంది జవాన్లకు గాయాలు

ఛత్తీస్గఢ్-TG సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బాంబుల మోత మోగింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా వరుసగా పేలాయి. దీంతో 11 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో 10 మంది DRG, ఒకరు కోబ్రా బెటాలియన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. వారిని ఆర్మీ హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. గతేడాది కర్రెగుట్టల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31మంది నక్సల్స్ మరణించారు.
News January 26, 2026
దూడలలో తెల్లపారుడు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

తెల్లపారుడు వ్యాధిని కలిగించే ఇ.కోలి క్రిమి సహజంగా దూడ పేగులలో ఉంటుంది. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో తేడా ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు.. దూడ పేగుల్లోని హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది.
News January 26, 2026
NTPCలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<


