News March 3, 2025
ఆసీస్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్పై గెలిచి సెమీస్లో ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది. కాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ పరాభవానికి ఆసీస్పై ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ఈ నెల 4న దుబాయ్ వేదికగా సెమీస్ జరగనుంది. ఆ మ్యాచులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ బాధ వారికి కూడా రుచి చూపించాలని కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News March 3, 2025
బీచ్లకు బ్లూఫ్లాగ్ గుర్తింపు ఎలా ఇస్తారంటే?

బీచ్లో నీటి నాణ్యత, పర్యావరణ విధానాలు, భద్రతలో మంచి ప్రమాణాలు పాటిస్తేనే బ్లూఫ్లాగ్ గుర్తింపు వస్తుంది. మలినాలు, రసాయనాలు బీచ్లో కలవకూడదు. PH ప్రమాణాలు బాగుండాలి. CC కెమెరాలు, డ్రైనేజ్, వ్యర్థాల నిర్వహణ, టాయిలెట్స్, సెక్యూరిటీ వంటి 33రకాల సౌకర్యాలు ఉండాలి. INDలో 12 బీచ్లకే ఈ గుర్తింపు ఉండగా, <<15632535>>రుషికొండ <<>>ఒకటి. డెన్మార్క్లోని ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ ట్యాగ్ ఇస్తుంది.
News March 3, 2025
బ్లూఫ్లాగ్ గుర్తింపుతో ఉపయోగం ఏంటి?

తీర ప్రాంత జలాల్లో మెరుగైన అభివృద్ధి తీసుకురావడమే ఈ <<15632535>>బ్లూఫ్లాగ్ <<>>లక్ష్యం. వరల్డ్ మ్యాప్లో కూడా బీచ్లకు ఈ గుర్తింపు చూడవచ్చు. ఈ గుర్తింపు ఉన్న బీచ్లను సందర్శించడానికి విదేశీయులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఈ ఫ్లాగ్ ఉంటే శుభ్రత, భద్రత పరంగా ఇబ్బంది ఉండదని వాళ్లు భావిస్తారు. ఈ ఫ్లాగ్ ఉన్న బీచ్ల ద్వారా ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
News March 3, 2025
ALERT: మీ ఫోన్ పోయిందా?

ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే అందులోని సిమ్ను బ్లాక్ చేయాలని TG పోలీసులు సూచిస్తున్నారు. ఆ నంబర్తో లింకై ఉన్న బ్యాంకు లావాదేవీలనూ నిలిపివేయాలని చెబుతున్నారు. ఫోన్ పోగొట్టుకున్న వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షల్లో డబ్బులు మాయమవుతున్న ఘటనలు ఇటీవల పెరిగాయని తెలిపారు. ఫోన్ నంబర్ సాయంతో ఆన్లైన్ మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని, అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.