News August 16, 2024
నీరజ్ను మా ఇంటికి ఆహ్వానిస్తా: అర్షద్ తల్లి

పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తల్లి రిజియా పర్వీన్ మరోసారి నీరజ్ చోప్రాపై తన అభిమానం చాటుకున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘నీరజ్ను మీ ఇంటికి పిలుస్తారా?’ అని జర్నలిస్టు అడగ్గా ‘అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. తప్పకుండా ఆహ్వానిస్తా’ అని ఆమె చెప్పుకొచ్చారు. పారిస్ ఒలింపిక్స్లో నదీమ్ గోల్డ్ గెలిచాక పర్వీన్ స్పందిస్తూ ‘సిల్వర్ గెలిచిన నీరజ్ కూడా నా కొడుకులాంటి వాడే’ అని పేర్కొనడం తెలిసిందే.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.