News July 17, 2024
ITR ఫైలింగ్ గడువు పొడిగిస్తారా?

ITR దాఖలులో పలువురు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో గడువు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ-ఫైలింగ్ సైట్లో లాగిన్ ఇబ్బందులు, పాస్వర్డ్ రీసెట్, ఈ-వెరిఫికేషన్లోనూ సమస్యలున్నట్లు చార్టెడ్ అకౌంటెంట్లు, పలువురు ఆర్థిక నిపుణులు ఆదాయ పన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లారు. కాగా జులై 31తో ఈ గడువు ముగియనుంది. ఇక జులై 14 వరకు 2.7కోట్ల రిటర్నులు దాఖలైనట్లు సమాచారం. గతేడాదితో పోల్చితే ఇది 13% అధికం.
Similar News
News January 25, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 25, 2026
రంగులు మారే గణపతి ఆలయం.. ఎక్కడంటే?

TN కేరళపురంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అందర్నీ అబ్బురపరుస్తోంది. ఇక్కడి వినాయక విగ్రహం ఉత్తరాయణంలో నలుపు, దక్షిణాయనంలో తెలుపు రంగులో దర్శనమిస్తుంది. ఇక్కడి బావి నీరు కూడా విగ్రహానికి వ్యతిరేక రంగులోకి మారుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కూడా కాలానుగుణంగా ఆకు రాల్చడం, చిగురించడం వంటి వింతలు ప్రదర్శిస్తుంది. 12వ శతాబ్దపు ఈ పురాతన గుడి మిరాకిల్ వినాయకర్గా భక్తులను ఆకర్షిస్తోంది.
News January 25, 2026
‘మన్ కీ బాత్’లో అనంతపురం ప్రస్తావన

AP: ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని అనంతపురం గురించి ప్రస్తావించారు. నీటి ఎద్దడి పరిష్కారానికి అక్కడి ప్రజల శ్రమను అభినందించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 7 వేలకు పైగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారని పొగిడారు. కాగా ప్రధాని మోదీ 130వ ‘మన్ కీ బాత్’లో ఈరోజు మాట్లాడారు.


