News March 16, 2024

జగన్‌కు ఈసారి ఆ సెంటిమెంట్ కలిసొచ్చి విజయం వరించేనా..?

image

మరికాసేపట్లో ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. జిల్లాకు చేరుకున్న సీఎం ఇడుపులపాయ బయలుదేరి వెళ్లారు. మహానేత సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌లు అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత 2019 ఎన్నికల సమయంలో వీరు ఇద్దరే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మరి అదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో కలిసొస్తుందా చూడాలి.

Similar News

News September 29, 2024

పింఛన్ పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ వినోద్ కుమార్

image

అనంతపురం జిల్లాలో అక్టోబర్ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పకడ్బందీగా పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి నగదు అందజేయాలని సూచించారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 28, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు, పశు, గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 37.0 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 26.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

News September 28, 2024

అనంత: 10 ఏళ్ల చిన్నారిపై VRA అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరులో నిన్న పదేళ్ల చిన్నారిపై వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అతను ఆ గ్రామ VRAగా పనిచేస్తున్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు తిరుపాలుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పుట్లూరు ఎస్సై హేమాద్రి తెలిపారు.