News March 16, 2024
జగన్కు ఈసారి ఆ సెంటిమెంట్ కలిసొచ్చి విజయం వరించేనా..?

మరికాసేపట్లో ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. జిల్లాకు చేరుకున్న సీఎం ఇడుపులపాయ బయలుదేరి వెళ్లారు. మహానేత సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్లు అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత 2019 ఎన్నికల సమయంలో వీరు ఇద్దరే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మరి అదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో కలిసొస్తుందా చూడాలి.
Similar News
News December 31, 2025
ఎస్పీగా విక్రాంత్ పాటిల్ పదిలమైన ముద్ర

కర్నూలు జిల్లా ఎస్పీగా 10 నెలల కాలంలో తనదైన ముద్ర వేసిన విక్రాంత్ పాటిల్, డీఐజీగా పదోన్నతి పొందారు. ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన ఆయన సైబర్ నేరాలు, గంజాయి విక్రయాలు, ఈవ్టీజింగ్పై ఉక్కుపాదం మోపారు. హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్పై అవగాహన కల్పిస్తూ నేరాల శాతాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. పదోన్నతి పొందిన ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
News December 31, 2025
కర్నూలు జిల్లాలో ఏడాదిలో 658 ప్రమాదాలు

కర్నూలు జిల్లాలో గత ఏడాది కంటే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 547 ప్రమాదాలు జరగగా, 2025లో ఆ సంఖ్య 658కి చేరింది. ముఖ్యంగా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవదహనం కావడం జిల్లాను కలచివేసింది. అలాగే డిసెంబరు 2న సంతోష్నగర్ వద్ద జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
News December 30, 2025
పెద్దహరివాణం మండలం పేరు మార్పుపై ఉద్రిక్తత

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద హరివాణం గ్రామంలో ఆందోళన తీవ్రతరమైంది. మంగళవారం సిరుగుప్ప, ఆదోని రోడ్డుపై స్థానికులు వందలాదిమంది బైఠాయించి టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు.పెద్దహరివాణం మండలంగా గత నెలలో నోటిఫికేషన్ వచ్చిందన్నారు. పెద్దహరివాణంకు బదులుగా ఆదోని మండలంను ఒకటి, రెండుగా విభజించి ప్రకటించడం తగదని ఆగ్రామంలో నాయకుడు ఆదినారాయణ రెడ్డి నిరవధిక దీక్షకు పూనుకున్నారు.


