News October 7, 2024
JK, హరియాణాలో బీజేపీ ఓడితే మార్కెట్లు క్రాష్ అవుతాయా?

హరియాణా, JK ఎన్నికల్లో BJP ఓడినా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. లోక్సభ పరంగా అవి చిన్న రాష్ట్రాలేనని పేర్కొన్నారు. ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్ అవ్వడాన్ని ఉదహరిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం కొంతమేర ప్రభావం చూపిస్తాయన్నారు. వెస్ట్ఏషియా యుద్ధం, క్రూడాయిల్ ధరల పెరుగుదల, జియో పొలిటికల్ పరిణామాల గురించే మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు.
Similar News
News March 26, 2026
విశాఖ: జాతీయ రహదారిపై ప్రమాదాల పరంపర..

విశాఖలోని జాతీయ రహదారులు ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల అమలులో నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రాణనష్టం జరుగుతోంది. ముఖ్యంగా భారీ వాహనాలు నిషేధ సమయాల్లోనూ నగరంలోకి ప్రవేశించి అతివేగంతో దూసుకెళ్తున్నాయి. రోజురోజుకీ ప్రమాదాలు పెరుగుతున్నా అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
News March 26, 2026
RCBకి కొత్త ఓనర్లు.. విజయ్ మాల్యా అభినందనలు

RCB కొత్త యజమానులకు ఒకప్పటి ఓనర్, వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. 2008లో ₹450కోట్లు పెట్టి ఈ ఫ్రాంచైజీ కొన్నప్పుడు అందరూ నవ్వుకున్నారని.. కానీ అదే ₹16,500Cr విలువైన బ్రాండ్గా ఎదిగినందుకు సంతోషంగా ఉందన్నారు. RCB ఎప్పటికీ తన డీఎన్ఏలో భాగమని.. యువ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం చెరగని జ్ఞాపకమని అన్నారు. తన హయాంలో, ఆ తర్వాతా RCBకి మద్దతు ఇచ్చిన ఫ్యాన్స్కు ధన్యవాదాలు తెలిపారు.
News March 26, 2026
‘హంద్రీ-నీవా’ రెండో దశకు గ్రీన్ సిగ్నల్

AP: హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో నాబార్డు/రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.1,184 కోట్లతో పనులు చేపట్టాలని సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. ఈ నిధులతో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, కాల్వల విస్తరణ, ప్రధాన కాల్వల పునరుద్ధరణ, ఆధునికీకరణ, ఇతర నిర్మాణ పనులు చేపట్టనున్నారు.


