News March 25, 2025

39మంది ఎంపీలతో పీఎంను కలుస్తాం: స్టాలిన్

image

డీలిమిటేషన్ విషయంలో తమ రాష్ట్రానికి చెందిన 39మంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని మీట్ అవుతామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ‘ఇటీవల ముగిసిన అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానాల ఆధారంగా తయారుచేసిన నివేదికను రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరితో కలిసి ప్రధానికి అందిస్తాం. తమిళనాడు పోరాటాన్ని ఆపదు. కచ్చితంగా ఈ పోరులో విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News October 18, 2025

బీసీ సంఘాల ‘రాష్ట్ర బంద్’.. నేతల వ్యాఖ్యలు

image

* బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కుట్రపూరితంగా స్టే తెచ్చారు. కోర్టులు మా మాట వినలేదు: R. కృష్ణయ్య
* రిజర్వేషన్లపై PM మోదీ వద్ద బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదు: మహేశ్ కుమార్ గౌడ్
* బీసీ బిల్లు ఆగిపోవడానికి బీజేపీ నేతలే కారణం: మంత్రి కొండా సురేఖ
* కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ విధానమే తప్పు: మాజీ మంత్రి తలసాని
* బీసీల హక్కులను కాపాడేది బీజేపీ ప్రభుత్వమే: ఈటల

News October 18, 2025

ఆరోగ్యకరమైన జుట్టుకు చిలగడదుంప

image

చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని ఇది అడ్డుకుంటుంది. చిలగడదుంపలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ A, C, B, E, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు జుట్టు రాలడం, పల్చబడటాన్ని తగ్గిస్తాయి. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

News October 18, 2025

పాకిస్థాన్‌ది అనాగరిక చర్య: రషీద్ ఖాన్

image

జనావాసాలపై పాక్ చేసిన వైమానిక దాడిని అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ‘ఈ అనాగరిక, ఆటవిక చర్యలో మహిళలు, పిల్లలు, దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సిన యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ట్రై సిరీస్ నుంచి వైదొలగాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఈ క్లిష్ట సమయాల్లో నా ప్రజల పక్షాన నిలబడతా’ అని ట్వీట్ చేశారు.