News March 17, 2024

జగన్‌పై మోదీ విమర్శలు చేస్తారా?

image

AP: అధికారం చేపట్టిన నాటి నుంచి CM జగన్.. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో మోదీ, జగన్ ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. కానీ ఇటీవల బీజేపీ.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈక్రమంలోనే ఇవాళ చిలకలూరిపేటలో మూడు పార్టీల సంయుక్త సభ జరగనుంది. దీనికి మోదీ హాజరుకానున్నారు. మరి ఈ సభలో తొలిసారి ఆయన జగన్‌పై విమర్శలు చేస్తారా? చేస్తే దేని గురించి మాట్లాడతారు? అనేది ఆసక్తిగా మారింది.

Similar News

News March 18, 2026

OFFICIAL: SRH కెప్టెన్‌గా ఇషాన్

image

IPL-2026 ప్రారంభంలోని కొన్ని మ్యాచులకు యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని SRH ప్రకటించింది. అలాగే అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉంటారని పేర్కొంది. పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయం నుంచి కోలుకున్న తర్వాత జట్టులో చేరుతారని తెలిపింది. దీంతో ఈనెల 28న RCBతో జరిగే తొలి మ్యాచ్‌లో కిషన్ జట్టును నడిపించనున్నారు.

News March 18, 2026

ఈ టీమ్స్ టాపార్డర్ చూస్తే వణకాల్సిందే..

image

IPLలో ఈ సారి చాలా జట్ల టాపార్డర్ బలంగా ఉంది.
*SRH: అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్, క్లాసెన్
*MI: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్, విల్ జాక్స్
*CSK: మాత్రే, శాంసన్, గైక్వాడ్, శివమ్ దూబే
*KKR: అలెన్, సీఫర్ట్, గ్రీన్, రహానే
*LSG: మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్
*PBKS: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్
> వీటిలో ఏ టీమ్ విధ్వంసకరంగా ఉందో కామెంట్ చేయండి.

News March 18, 2026

చైనాకు వెళ్లాల్సిన రష్యా ఆయిల్ నౌకలు భారత్‌కు!

image

రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను భారత్ డబుల్ చేసింది. ఎంతలా అంటే చైనాకు వెళ్లే ఆయిల్ షిప్పులను మళ్లించి భారత్‌కు పంపించేంతలా! ఆగ్నేయ ఆసియా నుంచి ఆక్వా టైటాన్ MAR 21న కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరనుంది. భారత్ ఒక వారంలో రష్యా నుంచి 30 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. మొత్తం ఏడు నౌకలను చైనా నుంచి ఇండియాకు రష్యా డైవర్ట్ అయ్యాయి. కాగా రష్యా $98కు బ్యారెల్‌ చొప్పున ఆయిల్ అందిస్తోంది.