News March 17, 2024
జగన్పై మోదీ విమర్శలు చేస్తారా?
AP: అధికారం చేపట్టిన నాటి నుంచి CM జగన్.. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో మోదీ, జగన్ ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. కానీ ఇటీవల బీజేపీ.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈక్రమంలోనే ఇవాళ చిలకలూరిపేటలో మూడు పార్టీల సంయుక్త సభ జరగనుంది. దీనికి మోదీ హాజరుకానున్నారు. మరి ఈ సభలో తొలిసారి ఆయన జగన్పై విమర్శలు చేస్తారా? చేస్తే దేని గురించి మాట్లాడతారు? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News September 29, 2024
తిరుమలలో రూ.కోటి ‘ఉదయాస్తమానసేవ’ గురించి తెలుసా?
AP: టీటీడీ వెబ్సైట్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. రూ.కోటితో కొనుగోలు చేస్తే రాబోయే 25 ఏళ్ల పాటు ఏడాదిలో ఏదైనా ఒక తేదీని ఎంచుకుని శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు. సుప్రభాత సేవ, తోమాల, అర్చన, ఊంజల్ సేవ, సహస్ర కలశాభిషేకం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ లాంటి సేవలు ఉంటాయి. ఆదాయపు పన్ను సెక్షన్ 80G కింద పన్ను మినహాయింపూ పొందొచ్చు. ప్రత్యేక కాటేజీ ఉచితంగా ఇస్తారు. పూర్తి వివరాలకు <
News September 29, 2024
GOOD NEWS: రైల్వేలో 14,298 ఉద్యోగాలు
నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. 9,144 టెక్నీషియన్ పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా వాటిని పెంచింది. 40 కేటగిరీల్లో 14,298 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. OCT 2 నుంచి 16 వరకు అప్లై చేసుకోవచ్చంది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎడిట్ ఆప్షన్ ఇస్తామని, కొత్త పోస్టులకూ అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ <
వెబ్సైట్: rrbapply.gov.in
News September 29, 2024
రాజ్యసభ రేసులో నాగబాబు?
AP: ఇటీవల మోపిదేవి వెంకటరమణ, మస్తాన్రావు, కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 3 సీట్లూ NDAకే దక్కనున్నాయి. వీటిలో 2 TDP, ఒకటి JSP పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి. TDP నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, జనసేన నుంచి నాగబాబు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. BJP అధిష్ఠానం తమకూ ఓ సీటు అడగొచ్చని సమాచారం.