News May 5, 2024
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వను: ప్రధాని

ఉత్తరం-దక్షిణం, కులం-మతం.. ఇలా పలు వైరుధ్యాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలామంది బ్రిటిష్ కాలం నుంచి ఎత్తులు వేస్తున్నారు. కానీ ఓటర్లు చాలా పరిణతి చెందారు. దక్షిణాది ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని నేను హామీ ఇస్తున్నా. అలాగే అన్ని మతాల అభివృద్ధితో కూడిన వికసిత్ భారత్ కోసం ప్రజలు ఐక్యంగా ఉన్నారు. తమ ఓటు ద్వారా ఆ విషయాన్ని నిరూపిస్తారన్న నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News January 23, 2026
కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్ కరాచీలోని ‘గుల్ షాపింగ్ ప్లాజా’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. శిథిలాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దుబాయ్ క్రాకరీ అనే షాప్లో ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాప్ లోపల దాక్కోగా.. ఊపిరి ఆడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు.
News January 23, 2026
MEGA 158లో చిరు సరసన ప్రియమణి!

చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు బాబీ డైరెక్షన్లో రాబోతున్న ‘మెగా 158’ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 23, 2026
బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.


