News July 30, 2024
రేపు రాలేను.. త్వరలోనే వస్తా: రాహుల్ గాంధీ

కేరళ: వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 123 మంది మృతి చెందారు. ఆ బాధిత కుటుంబాలను కలవడంతో పాటు పరిస్థితిని సమీక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రేపు వయనాడ్కు వెళ్లాల్సి ఉంది. అయితే ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా వేసుకున్నారు. త్వరలోనే వయనాడ్కు వస్తానని రాహుల్ X వేదికగా హామీ ఇచ్చారు. అటు కేరళకు తమిళనాడు రూ.5కోట్లు విరాళం ప్రకటించింది.
Similar News
News February 4, 2026
ఆధార్ దుర్వినియోగం.. క్షణాల్లో తెలుసుకోవచ్చు!

ఆధార్ భద్రత కోసం UIDAI ‘అథెంటికేషన్ హిస్టరీ’ ఫీచర్ను అందిస్తోంది. దీని ద్వారా ఆధార్ను గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవచ్చు. అందుకోసం UIDAI సైట్లోని ‘My Aadhaar’ విభాగానికి వెళ్లి ‘అథెంటికేషన్ హిస్టరీ’ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆధార్ నంబర్, OTPతో లాగిన్ అయితే వివరాలు కనిపిస్తాయి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే ఫిర్యాదు చేయవచ్చు. మీ ఆధార్ను సురక్షితంగా ఉంచడానికి ఇది ఉత్తమ మార్గం.
News February 4, 2026
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News February 4, 2026
‘చికెన్స్ నెక్’లో అండర్ గ్రౌండ్ రైళ్లు!

భారత్ సరిహద్దుల్లో ముఖ్యమైన సిలిగుడి కారిడార్ (చికెన్స్ నెక్)ను పటిష్ఠం చేసేందుకు కేంద్రం భూగర్భరైళ్లను నిర్మించనుంది. బెంగాల్లోని టిన్ మిలే హట్ నుంచి రంగాపానీ మధ్య భూమికి 20-24m అడుగున ఈ రైళ్లు నడవనున్నాయి. బంగ్లా బార్డర్కు సమీపాన ఉన్న ఈ ప్రాంతంలో నెట్వర్క్ పెంచడం ద్వారా నార్త్ఈస్ట్కు కనెక్టివిటీ పెరగనుంది. సైనిక అవసరాల్లో కీలక పాత్ర పోషించనున్న ఈ రైళ్లకు శత్రుదాడుల నుంచి రక్షణ ఉంటుంది.


