News July 30, 2024
రేపు రాలేను.. త్వరలోనే వస్తా: రాహుల్ గాంధీ

కేరళ: వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 123 మంది మృతి చెందారు. ఆ బాధిత కుటుంబాలను కలవడంతో పాటు పరిస్థితిని సమీక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రేపు వయనాడ్కు వెళ్లాల్సి ఉంది. అయితే ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా వేసుకున్నారు. త్వరలోనే వయనాడ్కు వస్తానని రాహుల్ X వేదికగా హామీ ఇచ్చారు. అటు కేరళకు తమిళనాడు రూ.5కోట్లు విరాళం ప్రకటించింది.
Similar News
News March 31, 2026
కలెక్షన్ల సునామీ.. చరిత్ర సృష్టించిన ధురంధర్-2!

‘ధురంధర్-2’ రూ.1,390CR(గ్రాస్) కలెక్షన్లు రాబట్టింది. ఫస్ట్ పార్ట్ లైఫ్టైమ్ వసూళ్ల(రూ.1,350CR)ను 12 రోజుల్లోనే అధిగమించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రాల లిస్టులో 4వ స్థానానికి చేరింది. తొలి 3 స్థానాల్లో దంగల్, బాహుబలి-2, పుష్ప-2 ఉన్నాయి. ఇక కర్ణాటకలో రూ.100+CR సాధించిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది.
-ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.
News March 31, 2026
వందే భారత్లో ఫుడ్.. అలెర్జీకి గురైన యువతి ఫొటో వైరల్

వందే భారత్ ఎక్స్ప్రెస్లో <<19481891>>ఫుడ్<<>> తిన్న తర్వాత అలెర్జీకి గురైనట్లు ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. పెదవులు ఉబ్బిపోయిన ఫొటో, మెడికల్ బిల్స్ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరలవుతున్నాయి. ‘వందే భారత్లో ఇచ్చే ఆహారం అత్యంత నాసిరకం. ఫిర్యాదు చేస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు’ అని ఆమె వాపోయారు. తన బిడ్డతో కలిసి దేవ్గఢ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించినట్లు బాధితురాలు పేర్కొన్నారు.
News March 31, 2026
పరారీలో ఖైదీ.. గ్యాస్ బుక్ చేసి దొరికిపోయాడు!

కర్ణాటకలో భార్యను హత్య చేసి, నాలుగేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సందీప్ తోమర్ అనే మాజీ జవాన్ చివరకు గ్యాస్ బుకింగ్ వల్ల దొరికిపోయాడు. 2014లో జీవిత ఖైదు పడిన ఇతను.. బెయిల్పై వచ్చి 2022 నుంచి పరారీలో ఉన్నాడు. నిందితుడి పాన్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయడంతో పోలీసులు అతడిని ట్రాక్ చేశారు. MPలోని పాండుర్నాలో మాటువేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.


