News April 29, 2024
అశ్విన్కు జట్టులో చోటే ఇవ్వను: సెహ్వాగ్

రాజస్థాన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటతీరులో దూకుడు లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శించారు. వికెట్లు తీయడం లేదని మండిపడ్డారు. ‘అశ్విన్ ఈ తీరులో ఆడాలనుకుంటే నేనైతే జట్టులో చోటే ఇవ్వను. తన తోటి బౌలర్లు చాహల్, కుల్దీప్ వికెట్లు తీస్తుంటే, తను మాత్రం రన్స్ కట్టడి చేయాలని చూస్తున్నారు. ఆఫ్స్పిన్ వదిలేసి క్యారమ్ బాల్స్ వేస్తున్నారు. తన మైండ్ సెట్ మారాలి’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 13, 2025
భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.
News November 13, 2025
నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్కు ముందు ఉమర్కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.
News November 13, 2025
NIT వరంగల్ 45పోస్టులకు నోటిఫికేషన్

<


