News September 26, 2024
ఈ జన్మలో టీడీపీలో చేరను: విజయసాయి రెడ్డి

తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్లు మంత్రి అచ్చెనాయుడు చేసిన వ్యాఖ్యలను విజయసాయి రెడ్డి ఖండించారు. ‘దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడంతో మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. నా విధేయతపై జోకులు పేలుస్తున్నావు. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా నేను ఈ జన్మలో కులపార్టీ అయిన టీడీపీలో చేరను’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 24, 2025
నేటి నుంచి VHT.. పంత్ మెరుస్తారా?

విజయ్ హజారే ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రూపు-Dలో తొలి మ్యాచ్ ఆంధ్ర, ఢిల్లీ జట్ల మధ్య జరగనుంది. ఢిల్లీ సారథిగా పంత్ బరిలోకి దిగుతుండగా విరాట్ సైతం సందడి చేయనున్నారు. కొన్నాళ్లుగా టెస్టులకే పరిమితమైన పంత్ VHTని సద్వినియోగం చేసుకుంటే పరిమిత ఓవర్ల క్రికెట్లోకి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. మరోవైపు ముంబై జట్టులో రోహిత్, పంజాబ్ టీంలో గిల్, అభిషేక్ తదితర స్టార్ ప్లేయర్లు మెరవనున్నారు.
News December 24, 2025
95 లక్షల మంది ఓటర్లు తొలగింపు!

3 రాష్ట్రాలు, ఒక UTలో SIR తర్వాత 95 లక్షల మంది ఓటర్లను తొలగించారు. MPలో 42.74 లక్షల మంది, కేరళలో 24.08 లక్షల మంది పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో కనిపించలేదు. ఛత్తీస్గఢ్లో 27.34 లక్షల మంది, అండమాన్&నికోబార్లో 3.10 లక్షల మంది ఓటర్లలో 64,000 మందికి చోటు దక్కలేదు. తమ ఐడెంటిటీని వ్యక్తిగతంగా చూపించి FEB 21, 2026న ప్రచురించే తుది జాబితాలో పేర్లను చేర్చుకోవడానికి ఈ ఓటర్లకు వారం రోజుల టైం ఇచ్చారు.
News December 24, 2025
JEE, NEET ఎగ్జామ్స్లో ఫేషియల్ రికగ్నిషన్!

JEE, NEET పరీక్షల్లో ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేయాలని NTA భావిస్తోంది. 2026 నుంచే ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా అడ్డుకునేందుకు దీనికి శ్రీకారం చుడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే పరీక్షలకు అప్లై చేసుకునే టైంలో రీసెంట్ ఫొటోగ్రాఫ్ల స్కాన్తో పాటు లైవ్ ఫొటోలను క్యాప్చర్ చేయడాన్ని తప్పనిసరి చేస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.


