News April 24, 2024
సెప్టెంబర్ 17లోగా షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం: రేవంత్

TG: మూతపడ్డ బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17లోపు తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో కాంగ్రెస్ జన జాతర సభలో ఆయన మాట్లాడారు. మాయమాటలతో ప్రజలను కవిత, అర్వింద్ మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
Similar News
News January 17, 2026
ఇరిగేషన్, ఎడ్యుకేషనే నాకు తొలి ప్రాధాన్యం: CM రేవంత్

TG: దేశానికి తొలి PM నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యం ఇచ్చారని, తానూ ఇరిగేషన్, ఎడ్యుకేషన్కే పెద్దపీట వేస్తానని CM రేవంత్ రెడ్డి తెలిపారు. MBNR(D) చిట్టబోయినపల్లిలో IIIT నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉంటుందని, ప్రతి విద్యార్థి నిబద్ధతతో చదువుకోవాలని సూచించారు. 25 ఏళ్ల వరకు కష్టపడితే 75 ఏళ్ల వరకు సంతోషంగా జీవించవచ్చన్నారు.
News January 17, 2026
పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు లాంటి సమస్యలుంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
News January 17, 2026
తల్లి దగ్గరకు వెళ్లగానే పిల్లలు ఏడుపు మానేసేది ఇందుకే!

నవజాత శిశువులకు వాసనను గుర్తించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తల్లి పాలలో ఉండే ప్రత్యేకమైన సువాసనను వారు ఇట్టే పసిగట్టగలరు. అందుకే ఆకలి వేసినప్పుడు శిశువు తన తలని తల్లి వైపు తిప్పుతుంటారని ఇందులో తెలిసింది. అలాగే శిశువులు వారి తల్లి డ్రెస్ వాసనను బట్టి ఏడుపు ఆపివేస్తారని మరో పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని మీరెప్పుడైనా గమనించారా? COMMENT


