News February 5, 2025
డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తా: లోకేశ్
AP: రాష్ట్ర ప్రజల డేటా చోరీ <<15354528>>ఆరోపణలపై<<>> వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ‘మా హయాంలో డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే వైసీపీ నేతలకు వ్యక్తిగతంగా రూ.10 కోట్లు ఇస్తా’ అని ఛాలెంజ్ చేశారు. కాగా 2014లో సీఎం చంద్రబాబు సేవా మిత్ర పేరుతో ప్రజల వ్యక్తిగత డేటా చోరీ చేశారని, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అదే పని చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది.
Similar News
News February 5, 2025
వరల్డ్ రికార్డుపై షమీ కన్ను
రేపు ENGతో జరిగే తొలి వన్డేలో IND పేసర్ షమీ ప్రపంచ రికార్డుపై గురిపెట్టారు. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీస్తే ODIలలో అత్యంత వేగంగా 200వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలుస్తారు. ప్రస్తుతం షమీ 100 మ్యాచ్లలో 195 వికెట్లు తీశారు. ఈ జాబితాలో మిచెల్ స్టార్క్ టాప్లో ఉన్నారు. అతను 102 మ్యాచ్లలో 200W కూల్చారు. ఆ తర్వాత ముస్తాక్-PAK(104M), ట్రెంట్ బౌల్ట్-NZ(107M), బ్రెట్ లీ-AUS(112M), డొనాల్డ్-SA(117M) ఉన్నారు.
News February 5, 2025
ఉగాది నుంచి P4: సీఎం చంద్రబాబు
AP: పేదరిక నిర్మూలనకు ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఉగాది నుంచి P4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్షిప్) విధానాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికంగా టాప్లో ఉన్న 10% మంది 20% మంది పేదలకు చేయూతనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పారిశ్రామివేత్తలు, NRIలు, ఇతర ధనవంతులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు.
News February 5, 2025
ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు
✒ 1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒ 1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒ 1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒ 1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒ 1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒ 2008: వన్డేల్లో సచిన్ 16,000 పరుగులు పూర్తి చేశారు