News December 1, 2024

ఏపీలో పుష్ప-2 టికెట్ ధరలు పెరుగుతాయా?

image

ఏపీలోనూ పుష్ప-2 టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. దేవర సినిమా కంటే అదనంగా పెంపు ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబర్ 4 నుంచి 23 వరకు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం <<14751051>>అనుమతిచ్చిన<<>> విషయం తెలిసిందే. ఈ ధరలపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 24, 2026

మున్సిపల్ బరిలో జాగృతి.. సింహం గుర్తుపై పోటీ!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి చీఫ్ కవిత నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థులను సింహం గుర్తుతో బరిలో నిలపనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే గుర్తుతో పోటీ చేయనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్‌కు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి అగ్ర నాయకత్వ నిర్ణయం తీసుకుంది. AIFBతో దీనిపై చర్చించింది.

News January 24, 2026

MANAGEలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (<>MANAGE<<>>) 3 Assist. డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్/అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రి B.M./HR మేనేజ్‌మెంట్), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.manage.gov.in

News January 24, 2026

ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ ఒగ్గుడోలు

image

TG: గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి విశ్వవ్యాప్తం కాబోతోంది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌పై తొలిసారి మన ఒగ్గుడోలు కళను ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి నేతృత్వంలోని 30 మంది బృందం ఈ చారిత్రక అవకాశం దక్కించుకుంది. ఢిల్లీలో తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా 15 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో తెలంగాణ జానపద కళా వైభవాన్ని చాటనున్నారు.