News March 27, 2025

ప్రతి వారం పిఠాపురం అభివృద్ధిపై సమీక్ష చేస్తా: పవన్

image

AP: ప్రతి వారం పిఠాపురం అభివృద్ధిపై సమీక్ష చేస్తానని, వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండకూడదని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అన్నారు. నియోజకవర్గంలో ఉన్న 4 PSల పరిధిలోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్‌ నివేదిక తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న కొందరు పోలీసు అధికారుల మూలంగా పోలీసు శాఖ చులకన అవుతోందని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు.

Similar News

News November 26, 2025

‘ఉద్యాన రైతుల ఆదాయం పెరగాలి.. కార్యాచరణ రూపొందించండి’

image

AP: రాయలసీమలోని 5.98 లక్షల మంది ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ఈ కార్యాచరణ ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పూర్వోదయ కింద రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌ అంశాలపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు.

News November 26, 2025

రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ స్పందిస్తారా?: కేటీఆర్

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల <<18387531>>తగ్గింపు<<>>, డబ్బు దుర్వినియోగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తారా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమని రాహుల్ గొప్పగా చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రూ.160 కోట్లు ఖర్చు చేశారు. తీరా చూస్తే 24 నుంచి 17 శాతానికి తగ్గించారు. దీనిపై రాహుల్ స్పందించే అవకాశం ఉందా?’ అని ట్వీట్ చేశారు.

News November 26, 2025

2027కు 30 డాలర్లకు ముడిచమురు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?

image

వచ్చే రెండేళ్లలో ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు సరఫరా భారీగా పెరగనుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. OPEC+(పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య), non-OPEC దేశాలు గణనీయంగా ఉత్పత్తిని పెంచడమే కారణమని తెలిపింది. దీంతో ప్రస్తుతం $60గా ఉన్న బ్యారెల్ ధర FY2027 చివరికి $30కు పడిపోవచ్చని వెల్లడించింది. దీనివల్ల అతిపెద్ద దిగుమతిదారైన INDకు భారీ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. పెట్రోల్ రేట్లు తగ్గొచ్చని నిపుణుల అంచనా.