News July 22, 2024
రోహిత్, కోహ్లీ 2027 WC ఆడతారా? గంభీర్ ఆన్సర్ ఇదే..

ఫిట్నెస్ కోల్పోకుండా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్లో రోహిత్, కోహ్లీ ఆడతారని కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వెల్లడించారు. గిల్ను మూడు ఫార్మాట్లలోనూ ఆడిస్తామని, సూర్య కుమార్ టీ20లు మాత్రమే ఆడతారని చెప్పారు. గాయంతో జట్టుకు దూరమైన షమీ బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. యువ క్రికెటర్లు నిలకడ చూపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై సీఎం సమీక్ష

APలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై CM చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఈ సిస్టమ్ పనిచేయనుంది. దీనివల్ల అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలు ఉంటుంది. కాగా కాసేపట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘంతో CM సమావేశం కానున్నారు.
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<


